కాంగ్రెస్కు హైప్ ఇద్దాం.. ఓట్లు చీలుద్దాం.. -బాబు కుట్రలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి అధికారమే లక్ష్యం. ఇందుకోసం ఎవరికైనా స్నేహ హస్తం అందిస్తారు. కొందరితో బహిరంగంగా పొత్తు పెట్టుకుంటారు. ఇంకొందరితో చీకట్లో ఒప్పందాలు చేసుకుంటారు. 24 ఎన్నికలకు ఇదే వ్యూహంతో బరిలోకి దిగారు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక బాబు కాంగ్రెస్ను వదిలేసి భారతీయ జనతా పార్టీ ప్రేమ కోసం తపిస్తున్నారు. ఇప్పటికే పొత్తు కోసం ఢిల్లీకి వెళ్లి కమలం పార్టీ పెద్దల్ని కలిశారు. మరోవైపు కాంగ్రెస్కు హైప్ తెచ్చి ఓట్లు చీల్చి లబ్ధి పొందాలని కుట్రలకు తెరతీశారు.
ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా.. అలాంటి పార్టీతో బాబు జతకట్టారు. దేశం కోసం స్నేహమని డబ్బా కొట్టుకున్నారు. ఇప్పుడేమో బీజేపీకి కోపం వస్తుందని కాంగ్రెస్కు నేరుగా మద్దతు ప్రకటించకుండా తన మనుషుల ద్వారా సంబంధాలు నెరుపుతున్నారు. తెలంగాణలో పాత శిష్యుడు రేవంత్రెడ్డి సీఎం కావడం నారా వారికి బాగా కలిసొచ్చింది. అతని ద్వారా హస్తం పార్టీలో తనకు కావాల్సిన పనుల్ని బాగా చక్కబెంటుకుంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో చీలక తెచ్చారు. షర్మిలను జగన్పై ఉసిగొల్పారు. ఆమెకు పీసీసీ చీఫ్ పదవి ఇప్పించి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నారు. జగన్ పార్టీ పెట్టాక కాంగ్రెస్ శ్రేణులన్నీ ఆయన వెంట నడిచాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీల్చేందుకు హస్తం పార్టీకి గాలి కొట్టి లేపే ప్రయత్నాల్లో ఉన్నారు.
బాబు ఆదేశాలతో ఎల్లో మీడియా కాంగ్రెస్కు విస్తృతంగా ప్రచారం కల్పిస్తోంది. చచ్చిపోయిన పార్టీకి బిల్డప్ ఇస్తూ జగన్ను కాంగ్రెస్ శ్రేణులు వీడేలా కుట్రలు చేస్తున్నారు. సుమారు పదేళ్లుగా ఆ పార్టీకి దిక్కు లేకపోతే డబ్బు పెట్టి మరీ కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఇటీవల ఆంధ్రజ్యోతిలో కాంగ్రెస్ నుంచి పోటీకి సై అని కథనం వచ్చింది. చంద్రబాబే దీనికి డైరెక్టర్ అనే విషయం చూడగానే అర్థమైపోతుంది. పెరుగుతున్న ఆశావహులు.. షర్మిల రాకతో కేడర్లో ఉత్సాహమంటూ రాధాకృష్ణ పత్రిక రాసింది. ఎన్టీఆర్, కృష్ణాలో అసెంబ్లీ సీట్ల కోసం 112 దరఖాస్తులు వచ్చాయని, రెండు పార్లమెంట్ స్థానాలకు 8 మంది పోటీ పడుతున్నారని రాసి మురిసిపోయింది. ఇంకా 23న కాంగ్రెస్, వామపక్షాల భేటీ ఉంటుందని, పొత్తు, పోటీ చేసే స్థానాలపై చర్చిస్తారని పేర్కొంది.
ఎలాగైనా జగన్ను ఓడించాలని చంద్రబాబు చేయని ప్రయత్నమంటూ లేదు. అందుకే కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేసేలా చక్రం తిప్పుతున్నారు. హస్తం పార్టీలో చెప్పినట్లు వినే షర్మిల ఉన్నారు. ఏపీ కమ్యూనిస్ట్ పార్టీలు నడిచేది తన దయతోనే కాబట్టి మాట వింటాయి. దీంతో ఎన్నికల్లో ఓట్లు భారీగా చీలి తాను లబ్ధి పొందవచ్చని నారా వారి ఆశ. ఇదిలా ఉండగా ఇటీవల బాబు మనిషి తులసిరెడ్డి మాట్లాడుతూ జగన్ నుంచి ప్రతిపాదన వస్తే ఇండియా కూటమిలోకి తీసుకునే విషయంపై ఆలోచిస్తామన్నారు. అసలు జగన్కు ఆ ఉద్దేశమే లేదు. ఇటీవల తిరుపతిలో ఇండియాటుడే నిర్వహించిన సదస్సులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. తన కుటుంబాన్ని చీల్చిందన్నారు. ఆ పార్టీని క్షమించే పరిస్థితి లేదన్నారు. కానీ వివిధ పార్టీల్లోని బాబు మనుషులు ఓ వైపు జగన్ బీజేపీ మనిషంటూ ప్రచారం చేస్తూనే.. మరోవైపు కాంగ్రెస్కు దగ్గరవుతున్నారని చెప్పడం ప్రారంభించారు. ఆయన్ను ప్రజల నుంచి దూరం చేసేందుకు జరుగుతున్న పన్నాగం ఇది.
అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదు. దేశంలో ఆ పార్టీ కనుమరయ్యే పరిస్థితులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పోటీ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారంటే నమ్మశక్యంగా లేదు. బాబే కొందరిని కాంగ్రెస్లోకి పంపుతున్నారు. వైఎస్సార్సీపీలో ద్వితీయశ్రేణి నాయకులను ప్రలోభపెట్టి హస్తం పార్టీలో చేర్పించి హైప్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ జగన్ను ఢీకొట్టాలంటే ఇవన్నీ కూడా సరిపోవు. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాల్ని నమ్ముకున్నారు. అవి అందుకున్న స్టార్ క్యాంపెయినర్ల ఆశీస్సులున్నాయి. బాబు ఎన్ని వేషాలు వేసినా ఓటమి చవిచూడటం ఖాయం.