చంద్రబాబు రాజకీయాలకు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ అంటూ ఉండవని చెప్పొచ్చు, అవసరమొస్తే ఎంతటి దిగజారుడు రాజకీయాలైనా చేయగల మనిషి చంద్రబాబు. ఒకసారి బీజేపీని తిడుతూ దేశాన్ని రాష్ట్రాన్ని మోదీ నుండి కాపాడాలంటాడు.. మరోసారి బీజేపీని నెత్తిన పెట్టుకుంటూ మోదీతో పొత్తుకు అర్రులు చాస్తాడు.. నీతిమాలిన రాజకీయాలు చెయ్యడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు.. 2018 నుండి 2019 ఎన్నికల వరకు మోదీని బీజేపీని తిట్టిన బాబు, ప్రస్థుతం ఆ పార్టీతో పొత్తుకై కాళ్ళ బేరానికి దత్తపుత్రున్ని పంపాడు.. బీజేపీ కూడా తక్కువేం కాదు మొన్నటిదాకా బాబు నీడ కూడా దరిచేరనీయమంటూనే నేడు కలిసి ఎన్నికల బరిలో దిగుతుంది.
చంద్రబాబు నాయుడు.. నాడు బీజేపీ అంటేనే విరుచుకుపడేవాడు.. బీజేపీ, మోదీ, అమిత్ షా అనే మాటలు వినపడగానే రెచ్చిపోయేవాడు.. ఆంధ్ర రాష్ట్రానికి మోదీ అన్యాయం చేశారంటూ ఆయన్ని నిలదీస్తున్నానంటూ ఆంధ్రప్రదేశ్ పై చీకటి రాజకీయాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించాడు.. మోదీ వ్యవస్థలను భృష్టు పట్టిస్తున్నాడంటూ, మోదీ దేశానికే దిష్టిబొమ్మ అన్నాడు.. అంతే కాదు ఆంధ్రా రాష్ట్రంలోకి మోదీ రావడానికి విల్లేదంటూ చంద్రబాబు “ మోదీ గో బ్యాక్ “ అనే నినాదం లేవనెత్తారు. మోదీకి ఎదురెళ్ళేందుకు మమతతో జత కట్టారు. అమిత్ షాను “ మీ కుమారుడి ఆస్తులు 16 వేల రెట్లు ఎలా పెరిగాయంటూ ” బహిరంగంగా ప్రశ్నించాడు చంద్రబాబు.
చంద్రబాబు అండ్ కో చేసిన నిరసనలు ధర్నాలు దీక్షలకు.. నరేంద్ర మోదీ స్పందిస్తూ.. టీడీపీ నిరసనలు మాకు దిష్టి చుక్కలాంటివి అంటూ తీసిపాడేసాడు.. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడు అన్నది కూడా మోదీనే.. వెన్నుపోట్లు పొడవడంలో, ప్రజల కలలను కల్లలు చెయ్యడంలో, పార్టీల పొత్తుల్లో, కూటములు కట్టడంలో చంద్రబాబు నాకంటే సీనియర్ అంటూ విమర్శించారు.. ఎన్టీఆర్ స్ఫూర్తిని వదిలి చంద్రబాబు కాంగ్రెస్ తో జత కట్టాడు అన్నారు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన వారిద్దరూ కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగుతున్నారు.
చంద్రబాబు, మోదీ మొన్నటి వరకూ తీవ్ర విమర్శలు చేసుకున్నారు.. కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎదుర్కోవటానికి టీడీపీ, జనసేనలకు ధైర్యం చాలక మళ్ళీ బిజెపితొ కుమ్మక్కయ్యాయి..