వ్యవసాయం దండగ, అందరూ సాఫ్ట్వేర్ నేర్చుకోండి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవడమే అంటూ హీనమైన వ్యాఖ్యలు చేసిన బాబు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న మొదటి రోజు నుండి రైతు వ్యతిరేక నిర్ణయాలే తీసుకునేవాడనటానికి సాక్ష్యమే 1996 నాటి ఈ ఘటన
1996 లో కాంప్లెక్స్ ఎరువుల ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు బాబు . ఆ నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆందోళన నిర్వహిస్తే అవునా అలా ఎలా పెంచుతారు అంటూ తనకి తెలియకుండా నిర్ణయం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షించి సంబధిత అధికారులను మందలించినట్లు గా పత్రికలకు లీకులిచ్చాడు..
ఆ తర్వాతి రోజే అఖిలపక్షం ఏర్పాటు చేసి ఎరువుల ధర పెంపుపై చర్చ జరపగా ప్రతిపక్షాలు ఎరువుల ధరలు పెంచకూడదని కోరాయి . అది జరిగిన మూడో రోజే ఎరువులపై సబ్సిడీ ఇవ్వడం సాధ్యం కాదని మీడియా సమక్ష్యం లో చెప్పాడు.. ఎరువుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుని ఐదో రోజు నండే అమలు చేశాడు…ముందుగా తనకి తెలియనట్లు నటించి, తర్వాత అఖిలపక్షం ఏర్పాటు చేసి ప్రతిపక్షాలు ఒప్పుకోకున్నా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుని బలవంతంగా అమలు చేశాడు..
విశేషం ఏమిటంటే దేవి గౌడ నాయకత్వం లో కేంద్ర ప్రభుత్వం ఎరువుల పై సబ్సిడీ ప్రకటించి తక్కువ ధరకే దేశవ్యాప్తంగా ఎరువులని అందిస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దానికి భిన్నంగా ఎరువుల ధర తగ్గించడం పక్కనబెడితే ఏకంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు.కనీసం సన్నకారు రైతులకు అయినా సబ్సిడీ ఇవ్వాలన్న విజ్ఞప్తులను కూడా తోసిపుచ్చి సన్న చిన్న ఏ రైతులకు సబ్సిడీ ఇవ్వటం కుదరదని తెగేసి చెప్పాడు బాబు.
దీనికి కారణం లేకపోలేదు… ఈ ఎరువుల ధర పెంపుకు ముందు ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ కి కాంప్లెక్స్ ఎరువుల తయారీదారులు నిధులు సమకూర్చారు. ప్రతిఫలంగా వారికి లబ్ధి చేకూర్చడానికి అందరూ వ్యతిరేకిస్తున్నా ధరలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు… ఈ విషయం పై అప్పట్లో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి, కానీ బాబుకు మాత్రం తన ప్రయోజనాలు, కార్పోరేట్ సంస్థల ప్రయోజనాలే ముఖ్యం.. రైతులంటే ఆయనకి ఎందుకో మొదటి నుంచీ ఏహ్య భావమే