చంద్రబాబు అధికారంలో ఉండగా చేసిన అనేక స్కాములు ఒక ఎత్తైతే ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో చేసిన స్కాములు ఇంకో ఎత్తు.. చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్ లో అత్యంత విలువైన 850 ఎకరాలను గంపగుత్తగా ఐఎంజి భారత్ కు కేటాయించి సెల్ డీడ్ చేయడం గురించి నిన్న వచ్చిన తీర్పు మనందరికీ విదితమే..
రాష్ట్ర విభజన అనంతరం 5 ఏళ్ల పాలన సాగించి అమరావతి లాంటి బడా స్కాములు చేసి చివరికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో రకరకాల మధ్యం బ్రాండ్లకి అనుమతులు ఇచ్చి అనేక ముడుపులు చేతులు మారాయి. ఒక కొత్త డిస్టిలరీ బ్రాండ్ కి అనుమతి రావాలి అంటే క్లిష్టమైన ప్రక్రియ, కానీ చంద్రబాబు 2019 లో ఆపద్ధర్మ సీఎం హోదాలో ఏప్రిల్, మే నెలలో అనుమతులు ఇచ్చారు. అంటే అధికారం నుండి ఆయన వెళ్లిపోతున్నాడని తెలిసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ.. మే 23న ఎన్నికల ఫలితాలు లెక్కింపు జరుగుతుండగా, ఫలితాలు వస్తే ఎలాగూ దిగిపోతానని ఆగే ఓపిక లేక ఏప్రిల్, మే నెలల్లో చంద్రబాబు ఇచ్చిన మద్యం బ్రాండ్ల అనుమతులు చూస్తే..
క్రేజీ డాల్, రాయల్ స్వీట్ డీలెక్స్, లెజెండ్ త్రిపుల్ 9, లెజెండ్ విస్కీ, న్యూకింగ్ లూయిస్ 14, ప్రెసిడెంట్ మెడల్ ఫైన్ విస్కీ, రాయల్ పాలెస్, సైనౌట్ ప్రీమియం, ఏడీ 79, త్రిపులెక్స్ రమ్, వీరా 91 బ్లాండ్ సమ్మర్, క్లిఫ్ హ్యాంగర్, చివరి క్షణాల్లో మే 14 తేదీన బూమ్ బూమ్ బీర్కు కూడా అనుమతి ఇచ్చారు. అలాగే హై ఓల్టేజ్ గోల్డ్ బీర్, ఎస్ఎన్డీజే బీర్, బ్రిటీష్ ఎపైర్ బీర్ ఇవన్నీ రాష్ట్రంలో రంగ ప్రవేశం చేసింది చంద్రబాబు గారి హయాం లోనే. రాయల్ పాలెస్ బ్రాండ్స్, సైనౌట్స్ రంగ ప్రవేశం చేసింది 2018 నవంబర్ 9న. ఇలా హడవాడిగా అనుమతులు ఇవ్వడం వెనుక కోట్ల రూపాయలు ముడుపులు అందాయనే వాదన ఉంది.
నాడు ఐఎంజీ భారత స్కాం అయినా, నేడు మధ్యం బ్రాండ్ల అనుమతైనా చంద్రబాబు ధన దాహానికి ఆపధర్మ సీఎం హోదా ఎలాంటి అడ్డు అనిపించలేదు. తాను ఓడిపోతున్నానని అర్థం అవ్వగానే తరువాతి ఐదేళ్లపాటు తన ఖర్చు, తన పార్టీ ఖర్చులను మేనేజ్ చేయడానికి అందినకాడికి దోచుకోవడానికి ఎలాంటి దారి దొరికినా వెనుకాడకుండా కొత్త కొత్త దారులు వెతుక్కుని మరీ దోపిడీకి పాల్పడతాడు.. పదేళ్లపాటు అధికారంలో లేకున్నా జేబులో నుండి పైసా తీయకున్నా పార్టీ లగ్జరీ గా నడవగలిగింది అంటే దానికి కారణం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాబు చేతివాటమే…