కూటమి తరుపున ఉమ్మడిగా ప్రచారం మొదలుపెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ లు ఇప్పటికే ఉమ్మడి గోదావరి జిల్లాలో నాలుగు సభల్లో పాల్గొని రెండో విడత లో భాగంగా తాజాగా విజయనగరం, నెల్లిమర్ల లో ఉమ్మడి ప్రచారానికి తెర లేపుతూ షెడ్యూల్ విడుదల చేశారు. కానీ విజయనగరంలో, నెల్లిమర్ల లో కూటమి అభ్యర్థులకు తీవ్ర స్థాయిలో రెబల్స్ బెడద వుండడంతో అవి ఎంతకూ కొలిక్కి రాకపోవడంతో చేసేది ఏమీ లేక విజయనగరం, నెల్లిమర్ల లో ఉమ్మడి సభలను రద్దు చేసుకొని కృష్ణ జిల్లాలోని పెడన, మచిలీపట్నానికి తమ ప్రచారాన్ని మార్పు చేసుకున్నారు.
విజయనగరంలో కూటమి తరుపున టీడీపీ నుండి అశోక్ గజపతి రాజు వారసురాలు అదితి గజపతి పోటిలో నించున్నారు. కానీ ఇక్కడ టీడీపీ నుండి 2014లో 14,000+ మెజారిటీ తో గెలిచిన మీసాల గీత 2019లో టీడీపీ నుండి టికెట్ దక్కకపోయినా కూడా 2024 వరకు టీడీపీకి కష్టపడి నమ్మకంగా పని చేశారు. తీరా ఎన్నికలు రాగానే చంద్రబాబు నాయుడు తనకు అలవాటైన వెన్నుపోటుతో మీసాల గీతకు కాకుండా అదితి గజపతి కి టికెట్ ఇవ్వడంతో మనస్థాపనికి గురి అయ్యారు. ఇది నా వ్యక్తిత్వ గౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి నేను కచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నాను పోటీలో నిలబడి గెలిచి చూపిస్తా అని టీడీపీ కి చంద్రబాబుకు సవాలు విసిరుతున్నారు. మీసాల గీత ను టీడీపీ పెద్దలు ఎంత సర్ది చెబుతున్న , చంద్రబాబు ఎమెల్సీ హామీ ఇచ్చినా కూడా వెనక్కి తగ్గడం లేదు. మీరు నా ఆత్మాభిమానన్ని దెబ్బ కొట్టారు నేను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో వుంటాను అని తెగేసి చెప్పారు. దీనితో ఇక్కడ ప్రచారానికి చంద్రబాబు నాయుడు భయంతో వెనకంజ వేశారు.
నెల్లిమర్లలో కూటమి తరుపున జనసేన అభ్యర్ధి లోకం మాధవి పోటీలో వున్నారు. ఇక్కడ టీడీపీ తరుపున అరుసార్లు వరుసగా విజయం సాధించిన సీనియర్ నాయకుడు పతివాడ నారాయణస్వామి తనకు టికెట్ రాకపోవడం తీవ్ర అవమానంగా భావించి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నారు. అంతే కాకుండా లోకం మాధవి తనతో అవమానకరంగా వ్యవహరించడం, కనీస గౌరవం ఇవ్వక పోవడంతో కూటమికి తన వర్గంతో సహా దూరంగా వున్నారు. మరో నాయకుడు బంగార్రాజు తనకే టికెట్ ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని తాను స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నానని ప్రకటించారు.
ఈ తలనొప్పులతో విజయనగరం, నెల్లిమర్లలో ప్రచారానికి పోతే ప్రజల నుండి ఆశించినంతగా స్పందన రాకపోవడంతో పాటు సొంత కార్యకర్తల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తుందని తమ ఉమ్మడి పర్యటనలను రద్దు చేసుకున్నారు బాబూ, పవన్ లు