ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం. వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను నిల్వచేసి వేలాది ఎకరాల సాగుభూమిని సస్యశ్యామలం చేయడానికి, లక్షలాది మంది ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తైతే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారతాయనడం అతిశయోక్తి కాదు. అయితే 2014 నుండి 2019 వరకు విభజిత ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంతో ప్రాజెక్టులో చాలా తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఆ తప్పిదాల కారణంగా ఈ రోజు ఒక ప్రాణం పోయింది. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ వద్ద ఏర్పడ్డ అగాధం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రాజెక్ట్ లో దిగువ కాఫర్ డ్యామ్ వద్ద ఏర్పడ్డ అగాధాలను పూడ్చే పనులను చేస్తున్నారు. అగాధాలను ఇసుకతో పూడ్చా క. దానిని బుల్డోజర్ తో చదును చేస్తుండగా ఇసుక అగాధంలో కూరుకుపోయింది. దీంతో బుల్డోజర్ తో పాటు డ్రైవర్ కూడా ఇసుకలో కూరుకుపోయి చనిపోయాడు..
రెండేళ్ళు భారీ వర్షాలతో పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న డయాఫ్రం వాల్, అప్పర్ కాఫర్ డ్యాం, మట్టి కట్టలు విపరీతంగా కోతకు గురయ్యాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ చానల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తిచేయకుండానే డయాఫ్రమ్ వాల్ను చంద్రబాబు నిర్మించారు. ఇంజనీర్ల మాట వినకుండా టెక్నాలజీ గురువుగా చెప్పుకునే బాబు.. అతితెలివితో చేసిన పని అది. దాని వల్లనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు పనులను మళ్ళీ ముందు నుండి చెయ్యాల్సి వచ్చింది. దాని కారణంగా ప్రాజెక్టు ఆలస్యం జరుగుతుంది. టీడీపీ హయాంలో ఎగువ, దిగువ కాపర్ డ్యామ్లు కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టారు.. కాపర్ డ్యామ్ సగంలో ఉండగానే డయాఫ్రమ్ వాల్ కట్టారు.. అందుకే డయా ఫ్రం వాల్ దెబ్బతింది. ఇది టీడీపీ చేసిన చారిత్రక తప్పిదం.