తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజనరీ, 40 ఇయర్స్ ఇండస్ట్రి, ప్రపంచ మేధావి, టెక్నాలజీకి ఆధ్యుడు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు తెచ్చింది ఆయనే.. సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు ఇచ్చే బిల్డప్ ఇది. నరేంద్రమోదీ కంటే సీనియర్నని చెప్పుకొనే ఈ వృద్ధ నాయకుడి సైకిల్ ఎన్నికల్లో ముందుకెళ్లాలంటే ఎవరో ఒకరు తొక్కాల్సిందే. ఈసారి అదే జరిగింది. ఎట్టకేలకు టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఓకే అయ్యింది. కానీ ఆ సైకిల్ ముందుకెళ్లే పరిస్థితులే కనిపించడం లేదు.
రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఎన్డీఏలో చేరారు. ఏపీలో సైకిల్ను తొక్కమని మోదీని కోరి.. తాను ముందు.. పవన్ కళ్యాణ్ వెనుక కూర్చొని విజయ తీరాలకు చేరారు. నేను గాలి కొట్టడం వల్లే ఇది సాధ్యమైందని బాబు డబ్బా కొట్టుకున్నాడు. 2019 ఎన్నికలు వచ్చేసరికి బాబు కమలం పార్టీకి బ్రేకప్ చెప్పేశారు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్తో జత కట్టారు. ఏపీలో సైకిల్ను తానే తొక్కాలని నిర్ణయించుకుని కొడుకు లోకేశ్ను వెనుక ఎక్కించుకుని బయలుదేరారు. ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయారు. సైకిల్ ఎందుకూ పనికి రాకుండా పోయింది.
2024 ఎన్నికలు వచ్చాయి. దీనికి కొంతకాలం ముందు నుంచే తన అతుకుల సైకిల్ ని తొయ్యమని మోదీ చుట్టూ తిరిగారు. తిట్టిన నోటితోనే హ్యాండిల్ పట్టుకోమని బతిమిలాడారు. ముందైతే ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్కు వెనుక స్థానం ఇచ్చేశాడు. తన కొడుక్కి కూడా చోటిచ్చాడు. అయితే సైకిల్ ఒకప్పటిలా లేదు. నేడు దాని టైర్ల నిండా పంక్చర్లే.. రిమ్ములు వంగిపోయాయి. కూర్చోవడానికి సీటు లేదు. దీంతో చాలారోజులు ఆలోచించిన కాషాయ పెద్దలు ఓ వర్గం ఒత్తిడికి తలొగ్గి ఎలాగోలా సైకిల్ తొయ్యాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పుడు దెబ్బతిన్న సైకిలైతే నిండింది. కనీసం గాలి కూడా లేకుండా ముందుకు కదిలేదెలా.. ఇప్పుడు ఇదే అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. మిగిలిన రాష్ట్రాల్లో ఏమో కానీ ఏపీలో మాత్రం జగన్ ఫ్యానే జోరుగా తిరుగుతుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మరి సైకిల్ను నెట్టమని జనాన్ని అడుగుదామా అని బాబు అనుకుంటే ఛీ అనడం ఖాయం. ఇప్పుడు ఏదో విధంగా సైకిల్ను అనుకున్న చోటుకు చేర్చకపోతే ఇక అది ఎందుకూ పనికిరాకుండా పోతుందని భయం.