చంద్రబాబు నాయుడు తన పెత్తందారీ మనస్తత్వాన్ని మరొక సారి బయట పెట్టుకున్నారు. ఎలక్షన్ ప్రచారం లో భాగంగా శింగనమల లో ప్రచారానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ సభ లో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఇక్కడ ఓక టిప్పర్ డ్రైవర్ కు ఇచ్చాడు జగన్ మోహన్ రెడ్డి గొప్పొడు అంటూ చులకనగా మాట్లాడారు.
అసలు టీడీపీ లో టికెట్ రావాలంటే వందల కోట్ల తో డబ్బు సంచులతో వస్తేనే టికెట్ లు ఇస్తారు అని జగమెరిగిన సత్యం దీనికి ఉదాహరణ గా ఓక సుజనా చౌదరి, సీఎం రమేష్, రెడ్డప్పగారి శ్రీనివాస్, నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి, కావ్య కృష్ణ రెడ్డి, కాకర్ల సురేష్, ఒంగోలు లో మాగుంట, దామరచర్ల, గుంటూరు లో పెమ్మసాని, ధూళిపాళ్ల, లావు, భాష్యం ప్రవీణ్, విజయవాడ కేశినేని చిన్ని, వెలిగండ్ల, ఇలా చెప్పుకుంటూ పొతే టీడీపీ లో ఎమ్మెల్యే టికెట్ కావాలి అంటే తక్కువలో తక్కువగా 50 కోట్లు పెట్టుకోవాలి ఎంపీ గా పోటీ చెయ్యాలి అంటే తక్కువగా 150 కోట్లు పెట్టుకోనే స్థాయి వుంటేనే టీడీపీ గేటు లోపలికి రానిస్తరు అని అందరికి తెలిసిన విషయమే.
చివరకు కోర్ట్ కేసుల వలన తన దగ్గర డబ్బులు లేకపోయే సరికి తనకు ఎంతో సహాయం చేసిన రఘురామ కృష్ణంరాజు ను పక్కన పెట్టిన ఘనుడు చంద్రబాబు నాయుడు. అదే టైం లో తన్ని నమ్ముకున్న ఒక సామాన్యుడు అయిన టిప్పర్ డ్రైవర్ ఆంజనేయులు కు వైసీపీ పార్టీ తరుపున శింగనమల ఎమ్మెల్యే గా అవకాశం ఇచ్చి తన గొప్ప మనసును జగన్ మోహన్ రెడ్డి చాటుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి తన సభల్లో తరచూ చెప్పే మాట ఈ ఎలక్షన్స్ పెత్తందారులకు , సామాన్యులకు మధ్య అనే విషయాన్ని, చంద్రబాబు నాయుడు తన మాటలతో అలాగే తాను నిలబెడుతున్న అభ్యర్థులతో పెత్తందారీ మనస్తత్వాన్ని ప్రూవ్ చేసుకుంటున్నారు .