ఎన్నికలు ప్రచారం మొదలైన తరువాత కొన్ని చోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులకు ప్రజల నుండి ఛీత్కారాలు మొదలైనాయి. శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రచారానికి సోమయాజులపల్లెకు వెళ్లిన సందర్భంలో మా ఊరికి ఏమి మేలు చేశావు, మా గ్రామ అభివృద్ధిని దేనికి అడ్డుకున్నావు అంటూ మహిళలు పెద్ద ఎత్తున ఎదురుతిరిగారు. దీనితో మీ అంతు చూస్తాను బిడ్డ , జాగ్రత్తగా ఉండండి మే 14 తరువాత మీ ఖాతా తెలుస్తా అంటూ మహిళల మీద విరుచుకుపడి బెదిరించారు బుడ్డా. దీనితో మహిళలు మరింతగా ఎదురుతిరిగే సరికి అక్కడినుండి పలాయనం చిత్తగించారు. ఇప్పుడు ఇదే శ్రీశైలం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.
బుడ్డా రాజశేఖర్ రెడ్డి 2014లో వైసీపీ పార్టీ నుండి గెలిచి నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అప్పటి అధికార పార్టీ టీడీపీలో జాయిన్ అయ్యి నియోజకవర్గానికి రాకుండా నియోజక అభివృద్ధిని, ప్రజలను విస్మరించి హైదరాబాద్ లోనే ఉంటూ వచ్చారు. తిరిగి 2019 ఎలక్షన్ సమయానికి టీడీపీ టికెట్ సంపాదించి పోటిలో నిలబడ్డారు అయితే పార్టీతో పాటు మమ్మల్ని మోసం చెయ్యడమే కాకుండా అభివృద్ధి కూడా చెయ్యలేదు అంటూ భారీ తేడాతో ఓడించారు.
అనంతరం కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్ లో ఉంటూ అప్పుడప్పుడు చుట్టపు చూపుగా నియోజకవర్గానికి రావడంతో పాటు వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి చేస్తున్న అభివృద్ది పనులను తన సొంత మనుషుల చేత కేసులు పెట్టించి అడ్డుకోవడం లాంటి పనులు చేస్తూ వచ్చారు. దీనితో విసుగు చెందిన ప్రజలు ఇప్పుడు ఎలక్షన్ ప్రచారానికి వస్తున్న బుడ్డా రాజశేఖర్ ను ఎక్కడిక్కడ నిలదీస్తూ మా గ్రామాల్లోకి ప్రచారానికి రావద్దు అంటూ తరిమితున్నారు. దీనితో అసహనానికి గురవుతున్నా బుడ్డా రాజశేఖర్ తాజాగా సోమయాజులపల్లె లో మహిళలను మీ అంతు చూస్తా మీ ఖాతా తేలుస్తా అంటూ విరుచుకుపడ్డారు.ఇప్పటికే సగం ఊర్లలో టీడీపీ పట్టులేదు ఇప్పుడు ఇలా ప్రజలను బెదిరిస్తే వచ్చే ఓట్లు కూడా దక్కవు అంటూ మీడియా ప్రతినిధులు పార్టీ నేతలు బుడ్డా రాజశేఖర్ కు సుచిస్తున్నారు.