2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడిన విషయం తెలిసింది. పొత్తు ఖరారు అయిన తర్వాత కీలక ఘట్టం అయిన సీట్ల పంపకం కూడా జరిగిపోయింది. కూటమిలోని అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో జోరుగా ఉన్నారు. పొత్తు ప్రకటన తర్వాత బీజేపీ ఎట్టకేలకు తాము పోటీ చేయబోవు ఎంపీ సీట్లను ప్రకటన చేసింది. పొత్తులో భాగంగా ఆరు ఎంపీ సీట్లు బీజేపీ పోటీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.ఆరు ఎంపీ సీట్లకు అభ్యర్థులకు సంభందించి ప్రకటన చేసింది బీజేపీ.
ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఈ విధంగా ఉంది ,రాజమండ్రి నుంచి బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి, అనకాపల్లి నుంచి మాజీ రాజ్యసభ సభ్యుడు సియం రమేశ్, సియం రమేశ్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు, అరకు నుంచి మాజీ యంపి కొత్తపల్లి గీత, రాజంపేట నుంచి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుంచి గతంలో వైసీపీ నుంచి ఎంపీగా, ఎమ్మెల్యే గెలిచిన వరప్రసాద్, నరసాపురం నుంచి బిజెపి సీనియర్ నేత శ్రీనివాస వర్మ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ అభ్యర్థులకు సంభందించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
కాగా అందరూ ఊహించినట్లు నరసాపురం నుంచీ వైసీపీ రెబల్ నేత రఘు రామ కృష్ణం రాజుకి బిజెపి టికెట్ దక్కకపోవడంతో టీడీపీ నేతలు పలువురు నిస్పృహ వ్యక్తం చేయడం విశేషం.