గత కొద్ది రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ ఏపీలో రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆ చట్టం కేంద్రం ప్రతిపాదించిన ఇన్ని రోజులు సైలెంట్ గా వున్న బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి తన మరిది చంద్రబాబుకు ఇబ్బంది రాకుండ అలాగే చట్టం చేసిన బీజేపీ కేంద్రం పేరు లేకుండా కుప్పి గంతులు వేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్రాలదే తుది నిర్ణయం అని ఈ విషయంలో ఎవరి ఒత్తిడి ఉండదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
అసలు ఈ చట్టం తెచ్చింది చేసింది మోడీ నేతృత్వంలోనీ నీతి ఆయోగ్. అయినా బయటకు వచ్చి నోరు కూడా తెరవని పురంధేశ్వరి ఇప్పుడు బయటకు వచ్చి నోరు తెరవడానికి గల కారణాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న విష ప్రచారంపై ఇప్పటికే సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి ఏ1 గా చంద్రబాబు, ఏ2 గా లోకేష్, ఏ3 గా టీడీపీని ఎఫ్ఐఆర్ లో చేర్చారు. దీనితో పాటు సీనియర్ బీజేపీ నాయకులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసింది కేంద్రం అయినా పొత్తులో ఉన్న టీడీపీ వారు దాని మీద విష ప్రచారం చేస్తున్నారు అంటూ ప్రెస్ మీట్ లు పెడుతుండే సరికి తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఇన్ని రోజుల తరువాత నోరు తెరిచి చాలా జగ్రత్తగా కేంద్ర ప్రభుత్వము, మోడీ, అమిత్ షా పేర్లు వాడకుండా నీతి ఆయోగ్ మీద నెట్టేసి , దానిని రాష్ట్రాలు కావాలంటే అమలు చెయ్యవచ్చు లేదంటే లేదు అని పాము చావాలి కర్ర విరగొద్దు అనే చందంగా మాట్లాడి వెళ్ళిపోయారు.
పురంధేశ్వరి మీడియాతో మాట్లాడిన మాటలను చూసిన రాజకీయ , మీడియా ప్రతినిధులు ఇప్పుడు చంద్రబాబు మాటలను సమర్ధిస్తూ కేంద్రం చేసిన చట్టము తప్పు అంటున్నారా లేక చంద్రబాబు నాయుడు మాటలు తప్పు అంటున్నారా అనే క్లారిటీ లేకుండా మరిది చంద్రబాబు ఆనందం కోసం పురంధేశ్వరి మాట్లాడినట్టు వుంది అని విశ్లేషణ చేస్తున్నారు.