ఎన్నికల వేల టీడీపీపార్టీ అభ్యర్థులు పలువురి వద్ద నగదు పట్టుబడటం సర్వ సాధారణం అయిపోయింది. రాష్ట్రంలో ఓటుకు నోటు సంప్రదాయం మొదలయ్యింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎదుర్కొన్న తొలి ఎన్నికలు జరిగిన 1995 నుంచేనని నాటినుండీ అదొక జాడ్యంలా మారిపోయిందిని పలువురు అనుభవజ్నులు విచారం వ్యక్తం చేస్తుంటారు. ఆ సాంప్రదాయానికి కొనసాగింపుగా 2024 ఎన్నికల్లో తొలి సారి బోణి కొట్టారు టీడీపీ బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ.
నేడు చీరాల మండలంలోని కావురి వారి పాలెంలో నరేంద్ర వర్మకి చెందిన రాయల్ మేరైన్ కంపెనీలో చీరాల డిఎస్పీ బెతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టిన పోలీసులకు యాభై ఆరు లక్షల రూపాయల నగదు దొరకగా దాన్ని స్వాధీనం చేసుకొన్న పోలీసులు ఆ నగదుని సీజ్ చేసి సోదాలు కొనసాగిస్తున్నారని సమాచారం.
కాగా నిన్నటి నుండి వైజాక్ నుండి బయటికొచ్చిన ఒక డబ్బు కంటైనర్ తాడేపల్లి చేరిందని అక్కడి నుండి అటూ ఇటూ తిరిగి మాయమైందని టీడీపీ సోషల్ మీడియా విభాగాలు, అధికారిక పేజీ సహా గగ్గోలు పెట్టిన విషయం విదితమే, బహుశా పోలీసులు ఆ సమాచారం ఆధారంగానే విచారణ చేపట్టి ఉండవచ్చని టీడీపీ సోషల్ మీడియా ఆరోపించిన కంటైనర్ తాడేపల్లి మీదుగా గమ్యస్థానమైన చీరాలలోని నరేంద్ర వర్మ కంపెనీకి చేరుకొందని అది తమ ఎమ్మెల్యే అభ్యర్థిదే అని తెలియక అరాకొరా సమాచారంతో లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా తమ ఎమ్మెల్యేనే బలి పశువుని చేశాయని దిగ్గజ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.