చంద్రబాబు ఒకరోజు డిల్లీకి వెళితే… బీజేపీయే ఎదురొచ్చి మరీ చంద్రబాబును పిలిపించుకుందని, ఇకపై జరగబోయేదో ఏకపక్ష సమరమే అని రాసి చంకలు గుద్దుకునే ఎల్లో మీడియా రాయడానికి కూడా ఇష్టపడని వార్త . స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబుకి ఇచ్చిన బెయిల్ ని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనుంది.
స్కిల్స్కామ్ కేసులో… ఆరోగ్యం బాగోలేదని పలు చిత్రవిచిత్ర రోగాల పేరుతో బెయిల్ తీసుకుని, ఆపై రెగ్యులర్ బెయిల్ వచ్చాక రాజకీయంగా అన్ని రకాల కార్యక్రమాలలో పాల్గొంటున్న చంద్రబాబుకు నచ్చని విషయం ఇది.
హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన ఈ బెయిల్ను సవాల్ చేస్తూ ఏ.పీ సీఐడీ సుప్రీం కోర్టుకు వెళ్ళింది. ఆ కోర్టు హియరింగ్ ఈరోజు రానుంది. జస్టిస్ బేలా.ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్లు ఈ కేసులో తీర్పు చెప్పనున్నారు. సెక్షన్ 17 అని, సీయంకు ఇటువంటి కార్యక్రమాలకు సంబంధం ఉండదని, సంభందిత అధికారులదే తుది నిర్ణయమని ఇలా ఎన్నోరకాల వాదనలతో చంద్రబాబును ఈ కేసు నుంచి తప్పించాలని ఢిల్లీ లాయర్ ఇప్పటికే ఎంతో శ్రమకోర్చారు. మరి ఢిల్లీలో ఆయన వాదనలు ఎలా ఉంటాయో చూడాలి మరి.
కానీ, స్కిల్ స్కామ్లో లాభపడ్డాం అంటూ టీవీల ముందుకు పిల్లలని తీసుకొచ్చి వాళ్ళు భవిష్యత్ని తీర్చిదిద్దింది చంద్రబాబే అని ఊదరగొట్టిన పచ్చ మీడియా… అవినీతి జరిగింది అని అన్నప్పుడు మాత్రం చంద్రబాబుకు ఆ పధకంతో ఏం సంబంధం అంటూ వింత వాదనను ముందుకు తీసుకొచ్చిన సంగతి కూడా మనకు తెలిసిందే. మరిప్పుడు రేపు చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వేస్తే తప్ప ఈ వార్త గురించి వాళ్ళు రాసే పరిస్థితి కనపడట్లేదు. దీనిని కప్పిపుచ్చేందుకు శంఖారావాన్ని, బాబు చాణక్యాన్ని పొగుడుతూ పేజీలు పేజీలు రాసినా ఆశ్చర్యపోనక్కరలేదు.