బీజేపీ పునాదులు మతతత్వ వాదం మీదనుంచి వచ్చాయన్నది అందరికీ తెలిసిన నిజం. అయితే కాలక్రమేణా ముస్లింలను ఆకట్టుకోవడానికి కొండొకచో బీజేపీ ప్రయత్నించినా… ఇప్పటికీ బీజేపీ అంటే పడని ముస్లిం ఓటర్లు ఉన్నారు.పైగా మోడీ – షా ద్వయం బీజేపీ పగ్గాలు చేపట్టాక తీసుకున్న అనేక నిర్ణయాలు, ప్రవేశపెట్టిన బిల్లులు దేశం సమగ్రతను కాపాడేవే అయినా… అన్నిటికీ వాళ్ళు బూచి కింద పాకిస్థాన్, చైనాలను చూపిస్తూ వస్తున్నారు.
ఇవే కాక మైనారిటీలుగా ఉన్న ముస్లింలను నాన్ మైనారిటీలుగా మార్చేందుకు బీజేపీ ప్రవేశపెడుతున్న బిల్లులను మొత్తం ముస్లింలు మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నారు. దీనిని అదనుగా తీసుకుని కాంగ్రెస్ వంటి పార్టీలు ఆ బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడుతుండగా… ముస్లింలు కూడా కాంగ్రెస్ వంటి పార్టీల చెంత చేరుతున్నారు. అయితే చాలా పార్టీలు మాత్రం కర్ర విరిగకుండా పాము చావకుండా నెట్టుకొస్తున్నారు.
కానీ ఆంధ్ర లో మాత్రం టీడీపీ తనకు అలవాటయిన గోడ మీద పిల్లి వైఖరిని అవలంబిస్తుంది. ముస్లిం ఓటర్లని ఆకట్టుకోవడానికి, వారిని తమ వైపు ఉంచుకోవడానికి బాబు ఎప్పుడూ పైరయత్నిస్తూనే ఉంటారు. మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కలర్ ఇవ్వాలన్న నేపధ్యంలోనే జలీల్ఖాన్ వంటి వారిని బాబు కావలసినన్ని రోజులు మోసారు. ఇప్పుడు పక్కకి పెట్టేసారు.
అయితే బీజేపీతో జత కట్టడంతో ముస్లిం ఓటు బ్యాంకు దూరమైపోతందేమో అనే బెంగతో ఉన్న చంద్రబాబుకు ఏపీ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. “ముస్లిం రిజర్వేషన్ 4% రద్దు చేస్తాము అనే బిజెపి నిర్ణయం నచ్చే అ నిర్ణయాన్ని ఒప్పుకొని టీడీపీ చంద్ర బాబు నాయుడు మాతో పొత్తు ఒప్పుకున్నారు” అని బిజేపీ నాయకులు మాల కొండయ్య నిన్న ఒక టీవీ ప్రసారంలో అనడంతో అవాక్కవడం బాబు వంతయింది.
ఏదో పైపైకి మాత్రమే పొత్తు పెట్టుకున్నట్టు ముస్లింల ముందు బాబు చేసిన డాబు అంతా ఈ వ్యాఖ్యతో తుడిచిపెట్టుకుపోయిందనీ, వాళ్ళు ఇంకా బాబుని నమ్మి ఓటు వేయరనీ, సాంప్రదాయ ముస్లిం ఓటు బ్యాంకు ఇక బాబుకి రావడం కష్టమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇలా జరిగిన డామేజీకి రిపేర్లు చేసే పనిలో పాపం బాబు ఇప్పుడు బిజీ అయిపోనున్నారు.