బీజేపీ తో టీడీపీ పొత్తుకు ఒప్పించడానికి నానా తిప్పలు పడి, ఆఖరికి తనకు కేటాయించిన సీట్లను కూడా త్యాగం చేసిన పవన్ కు కనీసం తనకు కేటాయించిన 21 సీట్లలో కూడా అభ్యర్థులను ప్రకటించడానికి పవన్ కు స్వేచ్ఛ లేకుండా పోయింది…ఆఖరికి తను పోటీ చేయబోయే సీటు పై కూడా ఇంకా స్పష్టత రాలేదు. అలాగే బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాలపై కూడా ఇంకా స్పష్టత రాలేదు..
తను ప్రకటించడు, జనసేన-బీజేపీ లనూ ప్రకటించనివ్వడు బాబు. ఇప్పటికే ప్రకటించిన సీట్లలో సగం పైగా స్థానాల్లో టీడీపీ నుండి బాబు పంపిన వారు, వైసీపీ లో టికెట్ దక్కని వారూ అవ్వడం, కొత్తగా ఇవ్వబోయే సీట్లలో కూడా తన వారికే టికెట్ లు వచ్చేలా బాబు ప్లాన్ చేయడం తో బిజెపి-జనసేన కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. తిరుపతి ఎమ్మెల్యే సీటు తొలుత బీజేపీ కి ఇస్తాం అని ప్రకటించగా ఇప్పుడు ఆ సీటు జనసేన కు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయ్, కాగా టీడీపీ నుండి సుగుణమ్మకు టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో సుగుణమ్మ తనకు తానే జనసేన నుండి నేనే పోటీ చేస్తానని ప్రకటించుకుని జనసేన కార్యకర్తలతో సమావేశాలు కూడా జరుపుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కు ప్రేక్షకపాత్ర తప్ప కనీస సమాచారం కూడా లేదు. పార్టీ ఎవరిది? దాని అధ్యక్షుడు ఎవరు? అభ్యర్థులను ఎవరు నిర్ణయిస్తున్నారు? ఒక పక్క బాబు ఇచ్చిన 21 సీట్లలో మేజర్ గా తన మనుషులకే టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మరోపక్క టీడీపీ నాయకులు మేమే జనసేన అభ్యర్థులం అని తమకు తామే ప్రకటించుకోవడం చూస్తే ఈ దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని హాస్యం ఏపీ రాజాకీయాల్లో పండుతుంది.. మరో పక్క బీజేపీ లో కూడా తనకు నచ్చిన వారికే సీట్లు వచ్చేలా పురంధేశ్వరి తో కలిసి ప్రణాళికలు రచించగా, స్థానిక నాయకత్వం బీజేపీ జాతీయ అధ్యక్షుడైన నడ్డాకు లేక రాయగా పురదేశ్వరి ని ఢిల్లీకి పిలిచి చివాట్లు పెట్టారు..
పార్టీ పవన్ ది.. నడిపేది నాదెండ్ల, సీట్లు ఇచ్చేది బాబు, అభ్యర్థులను బాబు నిర్ణయిస్తాడు, టీడీపీ వారు మేమే జనసేన అభ్యర్థులం అని ప్రకటించేసుకుంటారు… పవన్ ఏమో వంగా గీత గారు మా పార్టీ లోకి రావాలి అంటాడు. నన్ను దయచేసి గెలిపించండి, అడగడం కాదు అభ్యర్థిస్తున్న అంటాడు… పవన్ దయనీయ స్థితిని చూసి ఇదెక్కడి దిక్కుమాలిన పొత్తు అని రాష్ట్రం అంతా నవ్వుకుంటున్నారు…