నేడు అధిక ధరల విద్యుత్ పిపిఏల రద్దు వద్దంటూ యాగీ
తమ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను తర్వాతి ప్రభుత్వం సమీక్షించకూడదంటూ వింత వాదన.
2019 లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను సమీక్షించి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయాలని భావించింది. చంద్రబాబు హయాంలో జరిగిన పవన, సోలార్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలని.. పీపీఏ(పవర్ పర్చేజ్ అగ్రిమెంట్)లను ఎందుకు సమీక్షించాలో వివరిస్తూ ఏపీ ప్రభుత్వం 2019 జూలైలో కేంద్రానికి లేఖ రాసింది.
మొత్తం పవన విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 3,494 మెగావాట్లు కాగా, వీటిలో 63 శాతం ఒప్పందాలను అత్యధిక ధరకు గ్రీన్కో, రెన్యూ, మైత్రా కంపెనీలతో చేసుకుని వాటికి భారీగా లబ్ధి చేకూర్చేందుకు ఒప్పందాలు చేసుకుంది టీడీపీ ప్రభుత్వం. సాంకేతికంగా వస్తున్న మార్పులతో ఇంధన సామర్థ్యం బాగా పెరిగి టారిఫ్ తగ్గుతుంది. అయితే రెన్యూవబుల్ పవర్ పర్చేజి ఆబ్లిగేషన్స్ (ఆర్పీపీవో)లో పేర్కొన్నవాటికి విరుద్దంగా ఇంధన సరఫరా, డిమాండ్తో సంబంధం లేకుండా ఎక్కువ మొత్తానికి విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకోవడం తీవ్రమైన నేరమని ఆ లేఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం టీడీపీ చేసుకున్న దీర్ఘకాల ఒప్పందం ప్రకారం.. థర్మల్ విద్యుత్తు కిలోవాట్ పర్ అవర్ (యూనిట్)కు రూ.4.2కు అందుబాటులో ఉంటే పవన విద్యుత్తును యూనిట్కు అత్యధికంగా రూ.4.84 చెల్లించారు. దీనికి ఐటీ, ఎలక్ట్రిసిటీ సెస్ అదనంగా కలిపితే రూ.5.94కి చేరింది, దీని వల్ల ప్రైవేటు సంస్థలకు యూనిట్కు రూ.1.74 అధికంగా లబ్ధి చేకూర్చింది టీడీపీ ప్రభుత్వం.
టీడీపీ ప్రభుత్వ హయాంలో సోలార్ విద్యుత్తు యూనిట్ రూ.2 నుంచి రూ.3 మధ్యలో లభిస్తోండగా, రాజస్థాన్లో ఎస్ఈసీఐ రూ.2.44కి బిడ్డింగ్ వేస్తే, ఆంధ్రప్రదేశ్లో ఆర్పీపీవోలకు మించి రూ.6.99కి కొనుగోలు చేసింది టీడీపీ ప్రభుత్వం. అన్ని పన్నులూ కలిపితే రూ.8.09కి చేరింది, థర్మల్ విద్యుత్తుతో పోల్చితే ఈ సంస్థలకు అదనంగా యూనిట్కు రూ.3.89 కట్టబెట్టారు.
గత ప్రభుత్వం ఇలా ఎక్కువ ధరలకు విద్యుత్తు కొనుగోలు చేయడంతో ఏటా రూ.3 వేల కోట్ల నష్టం వస్తోందని, ప్రస్తుతం తగ్గిన ధరలతో పోల్చితే రూ.4వేల కోట్లకు చేరుతుందని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. తక్కువలో తక్కువగా గత ప్రభుత్వ నిర్ణయాలతో మూడేళ్లలో ఖజానాకు రూ.5,500 కోట్ల నష్టం జరిగిందని, ఈ ఒప్పందాలు 22 ఏళ్లపాటు కొనసాగితే మరింత ఆర్ధిక భారం పడనుందని, తక్కువ ధరలోనే విద్యుత్తు అందుబాటులో ఉన్నప్పటికీ, ఎక్కువ ధర చెల్లించి కొనడంతో డిస్కంలు దివాళా తీసే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వ విధానాల వల్ల ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు రూ.20 వేల కోట్ల బకాయిపడ్డాయి, ఇంకోవైపు వీటికి రూ.15 వేల కోట్ల అప్పులు పేరుకుపోయాయి. ఈ ఆర్ధిక భారాన్ని సరిదిద్దడానికి తక్షణం పరిష్కార చర్యలు తీసుకోవాల్సి వస్తోందంటూ జగన్మోహన్రెడ్డి కేంద్రానికి లేఖ రాసారు.
పీపీఏ ల రద్దు అని వైఎస్సార్సీపీ ప్రకటించిన అనంతరం టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా ప్రభుత్వం పై ఎదురుదాడికి దిగారు.. తమ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలని సమీక్షించడం, చేసుకొన్న ఒప్పందాలను రద్దు చేయడం మహా ఘోరం పాపం అంటూ యాగీ చేయడంతో పాటు టీడీపీ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పిపిఏ రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు.
ఒక ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక సమీక్షించడం, ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే రద్దు చెయ్యడం కొత్త విషయమేమీ కాదు.. మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి అయ్యిన వెంటనే మామ ముఖ్యమంత్రిగా తాను మంత్రిగా ఉన్న టీడీపీ కేబినెట్ అమలు పరిచిన పలు నిర్ణయాలను, చేసుకొన్న పలు ఒప్పందాలను రద్దు చేసి కొత్త ఒప్పందాలు చేసుకొన్నాడు బాబు .
వాటిలో ఇదే విద్యుత్ రంగానికి సంభందించిన ఎంవోయులు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ ప్రభుత్వం పలు కంపెనీలతో చేసుకున్న 23 విద్యుత్ ఎం.ఓ.యు లను చంద్రబాబు అధికారంలోకి రాగానే రద్దు చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వం ఆ ఎం.ఓ.యులను చేసుకున్నప్పుడు అదే మంత్రి వర్గంలో ఉండి కూడా అడ్డుచెప్పని చంద్రబాబు అధికారం ఛేజిక్కగానే సరైన కారణం చూపకుండా తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఉన్న సమయంలో ఏకపక్షంగా ఆ ఒప్పండాలు రద్దు చేసి కొంతకాలం రాష్ట్రాన్ని మరింత అంధకారంలోకి నెట్టారు.
చంద్రబాబు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకొంటాడో రాష్ట్ర ప్రజలకి అప్పట్లో పెద్దగా తెలియకపోవచ్చు కానీ అతని అవినీతి, స్వార్ధ గుణం ఇప్పటి ప్రజలకు బాగా తెలుసు.
కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. గతంలో పోలిస్తే విద్యుత్ రేట్లు భారీగా తగ్గాయని, ఈ పరిస్థితుల్లో ఎక్కువ రేట్లు పెట్టి విద్యుత్ కొనాల్సిన అవసరం లేదంటూ పీపీఏ లను రద్దు చేసేందుకు ప్రయత్నించగా ఇదే చంద్రబాబు నానా యాగీ చేశాడు. కమీషన్ల కోసం చంద్రబాబు చేస్తే కరెక్ట్.. కానీ ప్రజాధనం వృధా అవ్వకూడదన్న ఉద్దేశంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదే పని చేస్తే తప్పు.. ఇది టీడీపీ, ఎల్లో మీడియా వాలకం.
చౌక విద్యుత్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బాటను గుజరాత్ అనుసరించింది. ఎక్కువ ధర చెల్లించే పాత విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏల)ను గుజరాత్ 2020 లో రద్దు చేసింది.