దేశంలో జరగబోతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్పార్టీ మేనిఫెస్టోని శుక్రవారం విడుదల చేసింది. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీల పేరుతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. యువత, మహిళలే లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ రూపొందించిన మేనిఫోస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను చేర్చడం గమనార్హం. 48 పేజీలతో ఈ మ్యానిఫెస్టోను రూపొందించారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు
రూ.5 వేల కోట్లతో యువతకు స్టార్టప్ ఫండ్
విద్యా రుణాల వడ్డీ రేట్ల తగ్గింపు
ఓబీసీ వర్గాలకు ఉన్నత విద్య కోసం రిజర్వేషన్లు
పీఎంఎల్ఏ, సీఏఏ రద్దు
ఐపీసీ, సీఆర్సీపీ ఎవిడెన్స్ చట్టాల రద్దు
రైతులకు కనీస మద్దతు ధరపై హామీ
రైతులకు రుణమాఫీ , పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత
రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ
వ్యవసాయ వస్తువులపై జీఎస్టీ రద్దు
అగ్నివీర్ స్కీమ్ రద్దు
ఆర్మీలో అమలులోకి మళ్లీ పాత రిక్రూట్మెంట్ స్కీమ్
5 వేల కోట్ల రూపాయలతో యువత కోసం ప్రత్యేక నిధి
కులగణన ఆధారంగా రిజర్వేషన్లు అమలు
పేద మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం
ఉపాధి హామీ వేతనం రూ. 400
450 రూపాయలకే గ్యాస్ సిలిండర్
ప్రభుత్వ పరీక్షలు, ప్రభుత్వ పోస్టులకు దరఖాస్తు ఫీజుల రద్దు
ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమంపై ప్రధానంగా దృష్టి పెట్టి కాంగ్రెస్ మ్యానిఫెస్టోను రూపొందించినట్లు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వెల్లడించారు. బీజేపీ పాలనలో దేశంలో ప్రజలకు ఎలాంటి న్యాయమూ జరగలేదని ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి, అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తుందనిపేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ మేనిఫెస్టోను పరిశీలిస్తే యువత, రైతులు, సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు అర్ధమవుతుంది. యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు, మహిళల ఓట్లను కొల్లగొట్టేందుకు కొన్ని ఆకర్షణీయ హామీలను గుప్పించింది.