గీతాంజలి కేసులో పోలీసులు నిందితులని పట్టుకోవడంలో వేగం పెంచారు. ఈ రోజు ఉదయం గీతాంజలి ఆత్మహత్య కేసులో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త, బోండా ఉమాకి సన్నిహితుడు అయిన రాంబాబుని విజయవాడ సింగ్ నగర్లో తెనాలి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు లో భాగంగా ఇంస్టాగ్రామ్ లో అసభ్యంగా కామెంట్ చేసిన మరో నిందితుడు జనసేన సోషల్ మీడియా కార్యకర్త పీవీ దుర్గ రావుని పోలీస్ లు అరెస్ట్ చేసారు. వరుస అరెస్ట్ లు నేపథ్యంలో టీడీపీ , జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు పోస్ట్ చేసిన అకౌంట్లు బ్లాక్ చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసు లో ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని, పోస్ట్లు, వీడియోలు డిలీట్ చేసుకొన్నా తప్పించుకోలేరని పోలీస్ వారు హెచ్చరికలు జారీ చేసారు.
గీతాంజలి కేసు వివరాలకు వస్తే గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గానికి చెందిన గీతాంజలికి మార్చి 4వ తేదీన తెనాలి శాసనసభ్యుడు అన్నాబత్తుని శివ కుమార్ చేతులు మీదుగా ఇంటి పట్టా అందుకుంది. సొంతిల్లు లేని ఒక పేద మహిళకు ఇంటి పట్టా పొందిన ఆనందంలో ఒక మీడియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సొంతిల్లు కల సహకారం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞత చెప్తూ మాట్లాడిoది. అదే వీడియోలో జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పొందుతున్నాం అని తన పిల్లలకు అమ్మ ఓడి , తన మామయ్యకు నెల నెల పెన్షన్, వాళ్ళ అత్తకు వైయస్సార్ ఆసరా వంటి పథకాలు అందుతున్నట్లు తెలిపింది.
ఇన్ని అందజేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి మేము అండగా ఉంటాం అంటూ మాట్లాడింది. ఆ మాట్లాడిన మరుక్షణం నుంచి టీడీపీ, జనసేనలకు సంబందించిన ఐటీడీపీ కార్యకర్తలు, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు విపరీతంగా ట్రోల్ చేస్తూ అసభ్య పదజాలంతో తిట్టారు. ఈ ట్రోలింగ్ , అసభ్య పదజాలంతో కూడిన రాతలు, వీడియోలు చూసి తట్టుకోలేక ఈ నెల 7వ తేదీన ఆత్మహత్యా యత్నం చేసింది గీతాంజలి . ఆత్మహత్య చేసుకున్న వెంటనే గమనించిన ప్రజలు గుంటూరు గవెర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేసారు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ మూడు రోజులు తర్వాత తుది శ్వాస విడిచింది.
ఆ తరువాత బీసీ కమిషన్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఉదయం ఒకర్ని, ఇప్పుడు ఒకర్ని అరెస్ట్ చేయగా ఇంకా అరెస్ట్ చేయాల్సిన లిస్టులో కొందరు మీడియా వారు, కొందరు టీడీపీ లోకల్ లీడర్స్ ఉన్నారని సమాచారం .