సామాజిక రంగ వ్యయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ టాప్ గా నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులు, నెలవారీ వివిధ రంగాలకు చేసిన వ్యయాలపై కాగ్ గణాంకాలను వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి పది నెలల్లో (ఏప్రిల్ నుంచి జనవరి వరకు) రాష్ట్ర బడ్జెట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక రంగానికి రూ.1,30,366 కోట్లను కేటాయించి పది నెలల్లోనే రూ.1,07,610 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ తెలిపింది.ఇది 82.54 శాతం కావడం విశేషం.
సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, సంక్షేమం, పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరాపై ప్రభుత్వాలు వ్యయాన్ని సామాజిక రంగ వ్యయం అంటారు. నవరత్నాల ద్వారా సీఎం జగన్ సంక్షేమ పథకాలపై అత్యధిక వ్యయం ఖర్చు చేయడం వల్ల పేదల జీవన ప్రమాణాలు పెరిగాయి. విద్య, వైద్యం, రక్షిత మంచినీటిపై అత్యధికంగా ఖర్చు చేస్తూనే అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన వంటి పథకాల ద్వారా విద్యను పేద విద్యార్థులకు చేరువ చేస్తున్నారు.
కాగా కాగ్ గణాంకాల ప్రకారం సామజిక రంగ వ్యయంలో ఏపీ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ తరువాత స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో కర్నాటక,నాలుగో స్థానంలో తెలంగాణ,, ఐదో స్థానంలో కేరళ రాష్ట్రాలు నిలిచాయి.