ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతునేందుకు ప్రణాళిక శాఖ గణాంకాలే నిదర్శనం. 2011 ధరల మేరకు, ప్రస్తుత ధరల మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో చోటు చేసుకున్న ఉన్న వృద్ధి వివరాలను ప్రణాళిక శాఖ రూపొందించింది.
ప్రణాళిక శాఖ గణాంకాలలో.. తాజా ధరల మేరకు 2022-23 ఆర్థిక సంవత్స రంలో జిఎసిపి రూ.13,17,728 కోట్లుగా ఉన్నట్లు తేల్చారు. అదే గతేడాది అయితే జిఎస్ డిపి రూ.11,33,837 కోట్లుగా వుందని, దీంతో తాజాగా 16.22 శాతం వృద్ధిగా నమోదైరదని ప్రణాళిక శాఖ వివరించింది.
గత ఏడాది 10,40,187 కోట్లుగా ఉన్న జీవిఎ, ఈ ఏడాది 12,14,961 కోట్లకు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటే ఒక్క ఏడాదిలోనే 16.80 శాతం వృద్ధి సాధించినట్లు నమోదైంది.
వ్యవసాయ రంగంలో.. 2018-19లో వ్యవసాయ ఉత్పత్తి విలువ రూ.2,76,335 కోట్లుగా వుండగా, అది 2022-23 నాటికి ఏకంగా రూ.4,39,645 కోట్లకు చేరుకుంటున్నట్లు ప్రణాళిక శాఖ గణాంకాల్లో పేర్కొన్నారు. ఇది గతేడాది కంటే 13.18 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.
పారిశ్రామిక రంగంలో.. 2018-19 కన్నా ఏకంగా లక్ష కోట్ల విలువ పెరిగినట్లు చూపిరంచడం విశేషం. 2018-1955 1,88,601 కోట్లుగా ఉండగా, 2022-23 నాటికి అది రూ.2,83,821 కోట్లకు చేరుకున్నట్లు ప్రణాళిక శాఖ వెల్లడించింది. ఇది గత ఏడాదికన్నా 16.36 శాతంగా ఉన్నట్లు తేల్చారు. జాతీయస్థాయిలో కేవలం 14.2 శాతం వృద్ధి నమోదైతే రాష్ట్రంలో రెండు శాతం కన్నా ఎక్కువ వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నారు.
సేవా రంగంలో.. ఐదేళ్లలో రూ.1.60 లక్షల కోట్ల విలువ పెరిగినట్లు తెలిపారు. గత ఏడాది 4,07,810 కోట్లుగా విలువ అంచనా వేయగా, 2022-23లో 4,91,496 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది ఏకంగా 20.52 శాతం వృద్ధిగా రికార్డయింది.
ఆంధ్రప్రదేశ్ లో కనివిని ఎరుగని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో వృద్ధిరేటు గణనీయంగా పెరిగినట్లు ప్రణాళిక శాఖ గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. కానీ టీడీపీ వర్గాలు రాష్ట్రంలో అభివృద్ధి జరగడంలేదంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడైతే రాష్ట్రం అభివృద్ధిలో 50 ఏళ్ళు వెనక్కివెళ్ళిందంటూ మాట్లాడుతున్నారు.. వాస్తవానికి రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధి చెందడం మునుపెన్నడూ జరిగిందిలేదు. గత టీడీపీ ప్రభుత్వంలో నాశనమైన వ్యవస్థలను వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తున్నారు.