వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులతో పరిపాలిస్తున్న జగన్ ప్రభుత్వం దేశంలో ఒక అరుదైన ఘనతను సాధించింది. ఆరోగ్య శాఖలో కింది స్థాయి నుంచే సమస్య మూలాలపై పని చేయడం మొదలుపెడితే.. సమస్యలపైన సాధికారత సాధించవచ్చనీ తద్వారా పెద్ద సమస్యలను సులభంగా తప్పించవచ్చని నమ్మే జగన్, రాష్ట్రంలో విప్లవాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్, విలేజి క్లినిక్ వంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇలా ప్రవేశపెట్టిన సేవల వల్ల మారుమూల గ్రామాల్లోనూ, ట్రైబల్ ఏరియాల్లో వైద్యం అక్కడి ప్రజలకి సులభంగా అందుబాటులోకి వచ్చింది. అంతే కాక చిన్న గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ కూడా ప్రాధమిక వైద్యాలయాలను నిరంతరం అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుని ప్రజారోగ్యం పై శ్రద్ధ పెట్టారు.
అందుకే ఇప్పుడు భారతదేశం మొత్తమ్మీద.. వంద శాతం పని చేస్తున్న ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రజారోగ్యంపై జగన్కు ఉన్న శ్రధ్ధకు ఇది నిదర్శనం. తెలంగాణలో 49 శాతం, కర్ణాటకలో 43 శాతం, తమిళనాడులో 92 శాతం మాత్రమే హెల్త్ సెంటర్లు పని చేస్తూ ఉన్నాయి.