చంద్రబాబు గతంలో ఎప్పుడు చెప్పేవాడు ఐటీ పితామహుడు నేనే, కంప్యూటర్, సెల్ ఫోన్ కనిపెట్టిన బాబు 2014లో అధికారంలోకి వచ్చాక ఐటీ కంపెనీలు తీసుకురాకపోగా అప్పుడే ఊపు అందుకుంటున్న ఎంట్రప్రన్యూర్షిప్ ( కొత్తగా సొంతంగా కంపెనీ ) చేయాలి అనుకుంటున్న వారికి సహకరించలేదు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు విశాఖపట్టణంలో ఇన్నోవేషన్ & ఇంక్యూబేషన్ సెంటర్ ను పెద్ద ఎత్తున్న ఏర్పాటు చేస్తా అని ప్రచారం చేశాడు తూతూ మంత్రంగా ఏర్పాటు చేసి, స్టార్టప్ చేయాలి అనుకుంటున్న వారికి పెద్దగా సహాయ సహకరాలు అందించిన దాఖలాలు కనపడలేదు. అలా ప్రచార ఆర్భాటంలో ముందు ఉండే బాబు దిగిపోయే నాటికి మొత్తం స్టార్టప్ కంపెనీలు 161, వీటిలో 1552 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి.
2019లో జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టక చంద్రబాబు ప్రభుత్వంకు భిన్నంగా స్టార్టప్ ల ప్రోత్సాహానికి పెద్ద పీట వేసి, అనేక చర్యలు చేపట్టింది. స్టార్టప్ లకు మెంటార్షిప్, ఫండింగ్, ఇండస్ట్రీ కనెక్ట్, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే దానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు చాలా ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా ఆంధ్ర యూనివర్సిటీలో ఏ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్ టెక్ జోన్ లోనూ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ద్వారా ఈ రంగాలలో కూడా స్టార్టప్ లు పెట్టడానికి ముందుకు వస్తున్నారు అని ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో అనిల్ తెంటు ఒక ప్రకటనలో తెలిపారు.
వీటితో పాటుగా నాస్కామ్ సహాయంతో ఇండస్ట్రీ 4 టెక్నాలజీస్ అయినా క్లౌడ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ రోబోటిక్స్, బిగ్ డేటా, ఆగుమెంట్డ్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ , సైబర్ సెక్యూరిటీ ఇలా ఇన్ని రంగాలలోని స్టార్టప్ ల కోసం విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీను ఏర్పాటు చేశారు.
ఇన్ని రకాల సహకారాలు ద్వారా జగన్ ప్రభుత్వంలో స్టార్టప్ రంగాలలో ముందుకు దూసుకెళ్తోంది. తద్వారా జగన్ ప్రభుత్వంలో కొత్తగా 425 స్టార్టప్ లు తో 4117 మందికి ఉపాధి అవకాశం లభించింది. ప్రస్తుతానికి ఆంధ్రలో మొత్తం 586 స్టార్టప్ లలో 5669 మంది పనిచేస్తున్నారు. రానున్న రోజులలో జగన్ ప్రభుత్వం సహకారంతో మరింత అభివృద్ధి జరగనుంది. DPIIT (డిపార్టమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ) దాదాపు 4 రెట్లు స్టార్టప్ల సంఖ్య పెరిగింది అని ఒక ప్రకటనలో తెలిపింది.