2014 లో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక చంద్రబాబుకు పాలనలో అనుభవం ఉందని ఏపీ ప్రజలు బాబుకు అధికారం కట్టబెట్టారు. అనంతరం చంద్రబాబు అన్ని జిల్లాల్లోనూ సమగ్రాభివృద్ధి చేస్తానని హైదరాబాద్ నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామని, ముందు చేసిన పొరపాటు చేయను అంటూ మానిఫెస్టో ద్వారా ప్రజలని మోసం చేసింది కాక జిల్లాల అభివృద్ధి అంటూ ప్రజలకు కుచ్చు టోపీ పెట్టాడు. ముఖ్యంగా అనంతపురం ప్రజలకు అనేక హామీలిచ్చి ఆ జిల్లా ప్రజలను నట్టేట ముంచాడు.
బాబు ప్రకటించిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు
– కరువు నివారణకు 100శాతం డ్రిప్ – తుంపర్ల సేద్యం
– ఉద్యానవన కేంద్రం
– సెంట్రల్ యూనివర్సిటీ
– ఎయిమ్స్కు అనుబంధ కేంద్రం
– నూతన పారిశ్రామిక నగరం
– స్మార్ట్ సిటీ
– బీసీఐసీలో హిందూపూర్
– టెక్స్టైల్ పార్కు
– ఫుడ్పార్కు
– ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్వేర్ క్లస్టర్
– సోలార్ మరియు విండ్ పవర్
– పెనుగొండలో ఇస్కాన్ ప్రాజెక్టు
– భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
– ఆధ్యాత్మిక నగరంగా పుట్టపర్తి
– పుట్టపర్తిలో విమానాలకు నిర్వహణ,మరమ్మతుల కేంద్రం
– అనంతపురంలో విమానాశ్రయం
– కుద్రేముఖ్ ఇనుప ఖనిజ ఆధారిత ప్రాజెక్టు
– హంద్రినీవా ప్రాజెక్టును పూర్తి చేయడం
ఇలా ఇన్ని హామీలు ఇచ్చిన కరువు నివారణ నేపథ్యంలో రైతులకు 100% డ్రిప్ – తుంపర్ల సేద్యం అని మొదటి హామీ లో భాగంగా 20% రైతులకు మాత్రమే డ్రిప్ అందజేశాడు. బాబు సీఎంగా ఉన్న అయిదు సంవత్సరాలు వర్షాలు పడలేదు. దాంతో అనంతపురం తీవ్ర కరువు ప్రాంతంగా మారింది. ఉద్యానవన కేంద్ర ఊసే లేదు. సెంట్రల్ యూనివర్సిటీ కోసం చంద్రబాబు భూమినే కేటాయించలేదు కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెంట్రల్ యూనివర్సిటీకి అన్ని కేటాయింపులు జరిగి నిర్మాణాలు పూర్తి చేసుకొని ఓపెన్ అవ్వగా వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు జరుపుకోనుంది.
అనంతపురం కి వచ్చిన ఎయిమ్స్ ను మంగళగిరి కి తరలించాడు. నూతన పారిశ్రామిక నగరం అన్నాడు కానీ దాని ఊసే లేదు . స్మార్ట్ సిటీ, బీసీఐసీ, టెక్స్టైల్ పార్క్, ఫుడ్ పార్క్, ఎలక్ట్రానిక్స్ & హార్డ్వేర్ క్లస్టర్, సోలార్ & విండ్ పవర్,పెనుగొండలో ఇస్కాన్ ప్రాజెక్ట్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలిచ్చినా వాటిని నెరవేర్చేందుకు చంద్రబాబు ఒక అడుగు కూడా వేయకపోవడం గమనార్హం.ఆధ్యాత్మిక నగరంగా పుట్టపర్తికి ఒక రూపాయి కేటాయించలేదు. పుట్టపర్తి లో ఉన్న విమానాశ్రయం అభివృద్ధికి దిక్కు లేదు కానీ అనంతపురంలో విమానాశ్రయం నిర్మిస్తానని చంద్రబాబు అబద్ధపు హామీలివ్వడం విశేషం.
పుట్టపర్తి విమానాశ్రయం లో నిర్వహణ , మరమ్మతుల కేంద్ర ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చినా ఆ హామీని నెరవేర్చలేదు. జగన్ ప్రభుత్వం వచ్చాకే ఆ దిశగా అడుగులు పడ్డాయి. కుద్రేముఖ్ ఇనుప ఖనిజ ఆధారిత ప్రాజెక్ట్ గురించి చంద్రబాబు మరచిపోయి చాలాకాలం అయింది. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చి, వైఎస్సార్ హయాంలోనే 90 శాతం పనులు పూర్తి అయిన ప్రాజెక్టుకు , మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయడానికి 4 సంత్సరలా 9 నెలలు సమయం తీసుకొని ఆ పది శాతం పని కూడా పూర్తి చేయకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా నీళ్ళు నీ విడుదల చేసి నేనే పూర్తి చేశా అని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నాడు. ఇలా అనంతపురం అభివృద్ధికి కేవలం గాలి హామీలిచ్చిన చంద్రబాబు ఆచరణకు మాత్రం ముందడుగు వేయలేదు.