ఎన్డీఏలో చేరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని భారతీయ జనతా పార్టీ బతిమిలాడిందని ఎల్లో మీడియా నెలరోజుల పైనుంచి డబ్బా కొడుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆహ్వానం మేరకే ఆయన హస్తినకు వెళ్లారని పేజీలకు పేజీలు రాసుకొచ్చారు. నారా వారు పెద్ద తోపని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో రాతలు రాశారు. కానీ షా ఒక్క మాటతో వారందరి గాలి తీసేశారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం ఇండియాటుడే కాంక్లేవ్ జరిగింది. ఇందులో యాంకర్ షాను పలు ప్రశ్నలు వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఓ సందర్భంలో చంద్రబాబు టెరరిస్ట్ అని సంబోధించారు. అలాంటి వారిని ఎన్డీఏలో ఎందుకు చేర్చుకున్నారని అడిగారు. అమిత్షా ఈ విధంగా స్పందించారు. బాబు మోదీని తిట్టి కూటమి నుంచి వెళ్లిపోయారు. 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. ఆయనకు బుద్ధి వచ్చింది. మా దగ్గరకు వచ్చి ఎన్డీఏలో చేరుతానన్నారు. దీంతో చేర్చుకున్నామని సమాధానమిచ్చారు.
షా మాటలతో తెలుగు తమ్ముళ్లు రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి అమిత్షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలిసినప్పటి నుంచి ఏపీలో ఎల్లో గ్యాంగ్ చేసిన హడావుడి అంతాఇంతా కాదు. బాబు గెలుస్తున్నారని సమాచారం ఉంది కాబట్టే కమలం పెద్దలు బతిలాడుకుంటున్నారని ప్రచారం చేశారు. నారా వారి లాంటి అనుభవజ్ఞుడు తమతో ఉండాల్సిందేనని పట్టుబట్టి తీసుకెళ్లారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మురిసిపోయారు. తీరా షా ఒక్కమాటతో గాలి తీసేశారు. తమ అండ లేకపోతే బాబు ఎదగలేడని, ఈ విషయం ఆయనకు బాగా తెలుసు కాబట్టే మళ్లీ వచ్చి బతిమిలాడుకున్నాడనే ధోరణలో మాట్లాడారు.
లోకేశ్ భవిష్యత్, తనపై కేసుల నుంచి తప్పించుకోవడాకే చంద్రబాబు ఎన్డీఏలో చేరాడన్నది నిజం. దానిని ఎల్లో మీడియా ద్వారా రాష్ట్ర ప్రయోజనాల కోసమంటూ కలరింగ్ ఇచ్చినా ఎక్కువ కాలం దాగలేదు. కమలం పెద్దలే కుండబద్ధలు కొట్టినట్లు సమాధానాలు చెప్పారు. ఇప్పుడు బాబు ఎప్పటిలాగే బిల్డప్ బాబాయ్లా వ్యవహరిస్తారా లేక.. సైలెంట్గా ఉంటారా..