ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఒంటరిగా ఢీ కొట్టే సాహసం చేయలేని చంద్రబాబు, జనసేన నేత పవన్ కళ్యాణ్ మద్యవర్తిత్వంతో బీజేపీ పంచన చేరిన విషయం తెలిసిందే, అయితే బీజేపీతో కూటమైతే కట్టారు కానీ చంద్రబాబు వారితో సాగిస్తున్న ప్రయాణం మాత్రం అంత సాఫీగా జరుగుతునట్టు కనిపించడంలేదు. బీజేపీ తాను పోటీ చేసే స్థానలపై పట్టు పట్టి సాధించుకోవడం దగ్గర నుండి చంద్రబాబు అనునాయులకి సైతం బీజేపీ నుండీ టికెట్లు ఇవ్వడానికి వీలు లేదంటూ వారు చేస్తున్న రభస చూస్తుంటే చంద్రబాబు వారికి ఎంతగా లొంగిపోయి ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు .
ఇప్పటికే బీజేపీ, చంద్రబాబు పట్ల టీడీపీ నాయకులు కార్యకర్తల పట్ల ప్రవర్తిస్తున్న తీరుతో నొచ్చుకుంటున్న తెలుగు తమ్ముళ్ళు నిన్నటి రోజున కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన సంచలన వాఖ్యలతో మరింతగా లోలోపల మదన పడిపోతున్నారు. మొన్నటి వరకు చంద్రబాబుని నమ్ముకుని బీజేపీని సైతం నానా దుర్భాషలాడిన టీడీపీ క్యాడర్ కు ఇప్పుడూ చంద్రబాబే వారికి లొంగిపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న వేల వారికి మరింత తలపోటు తెచ్చేలా అమిత్ షా వాఖ్యలు ఉన్నాయని వారు వాపోతున్నారు.
న్యూఢిల్లీలో నిన్నటిరోజున జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్లో కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను యాంకర్ ప్రశ్నలు అడిగే క్రమంలో ప్రధాని మోదీని చంద్రబాబు గతంలో టెర్రరిస్ట్ అన్నారు కదా అలాంటి వ్యక్తితో మీరెలా పొత్తు పెట్టుకున్నారు’ అని వేసిన ప్రశ్నకు అమిత్షా జవాబు ఇస్తూ ‘ప్రధాని మోదీని చంద్రబాబు టెర్రరిస్ట్ అని ఎన్డీయే నుంచి వెళ్లిపోయిన మాట నిజమే కానీ మేం ఆయనను వెళ్లమనలేదు. ఆయనే వెళ్లిపోయారు. ఫలితంగా ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత బాబుకు బాగా బుద్ధొచ్చింది. మళ్లీ మా వద్దకు వచ్చారు. తిరిగి ఎన్డీయేలో కలుస్తానని రాయబారాలు పంపారు. దీంతో ఆయనను కలుపుకున్నాం అంటూ హేళనగా మాట్లాడేసరికి అక్కడి వారంతా బాబు వ్యక్తిత్వంపై జోకులు వేసుకుంటూ భళ్ళున నవ్వారు.
రాజకీయ అవసరాలే తప్ప , రాజకీయ సిద్దాంతాలు లేని చంద్రబాబుకి ఇలా ఒకరి చేత మాటలు అనిపించుకోవడం కొత్తేం కాదు గతంలో కమ్మ్యునిస్టులతో, దేవ గౌడతో, కాంగ్రెస్ తో కూడా పొత్తులు అంటూ కలిసి దూకే కప్ప గంతులకి అనేక సార్లు అనేక మంది అనేక మాటలు అంటూనే ఉన్నా ఆయన లో మాత్రం నేటికీ మార్పు లేదు. ఇలాంటి వ్యక్తి కొత్తగా హేళనకి గురి కావడం కాదని , ఆయనకి ఇది ఒక నిరంతర ప్రక్రియలో భాగమేనని విశ్లేషకులు చెబుతున్న మాట