ఎప్పుడు ఎక్కడ నిర్మించాడో చూపిస్తే పాడు బెట్టారో లేదో తెలుస్తుంది కదా
విజయవాడ స్వరాజ్ మైదానంలో 400 కోట్ల ఖర్చుతో 125 అడుగుల విగ్రహంతో అంబేద్కర్ స్మృతివనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అంబేద్కర్ గారి విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా పెడస్టల్ ఎత్తు 81 అడుగులుంటుంది. మొత్తంగా 206 అడుగుల ఎత్తులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఠీవిగా నిల్చుని ఉంటుంది. దాదాపు 19 ఎకరాల్లో ఏర్పాటైన స్మృతివనంలో అంబేద్కర్ ఫోటో గ్యాలరీ, జీవిత విశేషాలు, శిల్పాలు కనువిందు చేస్తాయి.
ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహంగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఈ విగ్రహం మన దేశంలో అత్యంత భారీ విగ్రహాల్లో మూడవది కావడం గమనార్హం. అందులో మొట్టమొదటిది స్టాట్యూ ఆఫ్ యూనిటీగా పేరు ప్రసిద్ధిచెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. ఆ విగ్రహం ఎత్తు 597 అడుగులు ఉంటుంది. రెండవది శంషాభాద్ సమీపంలో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం. పంచలోహాలతో నిర్మించిన ఈ విగ్రహం ఎత్తు 216 అడుగులు ఉంటుంది. ఇక మూడో విగ్రహం రేపు విజయవాడలో ఆవిస్క్రుతం కానున్న 206 అడుగుల ఎత్తుగల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం. అంబేద్కర్ గారి మహాశిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం.. ఇది “స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’’ గా చరిత్రలో నిలిచిపోతుంది. విజయవాడ బందర్ రోడ్డులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ నవంబర్ 19 న జరగనుంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి కార్యాన్ని చూసి టీడీపీ ఓర్వలేకపోతుంది. రాజధానిలో అంబేద్కర్ స్మృతివనాన్ని పాడుబెట్టారని.. హైదరాబాద్లో రూ.150 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటయితే.. ఏపీలో కూడా అలాంటి విగ్రహానికే రూ.400కోట్లు ఎలా అయ్యాయని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసినది 11 ఎకరాల్లో 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం కానీ విజయవాడలో కడుతున్నది అంబేద్కర్ స్మృతివనం.. దాదాపు 19 ఎకరాల్లో 206 అడుగుల విగ్రహం.. రెండింటికీ చాలా తేడా ఉంది.. మాజీ మంత్రి అయ్యుండి నక్కా ఆనంద్ బాబు ఈమాత్రం వ్యత్యాసం కూడా అర్ధం చేసుకోలేకపోతే ఎలా.. ????
టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన అంబేద్కర్ స్మృతివనాన్ని పాడుబెట్టారని ఆనంద్ బాబు అన్నారు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి దగ్గరలో 125 అడుగులు వచ్చే అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తామని చంద్రబాబు పదే పదే ప్రగల్బాలు అయితే పలికుతూ 2016 లో తీర్మానాన్ని అయితే చేశాడు.. కానీ స్థలాన్ని కేటాయించ లేదు, కట్టేందుకు అడుగులు ముందుకు పడిన దాఖలాలే లేవు. అలా స్థలం లేకుండా, విగ్రహం కనబడకుండా టీడీపీ నేతల బుర్రలో కట్టిన అంబేద్కర్ స్మృతి వనాన్ని వైఎస్ జగన్ వచ్చి పాడు బెట్టారా.. మాట్లాడే ముందు కనీస అవగాహన అయినా ఉండాలి కదా.. మీ బుర్రలోనో లేక చంద్రబాబు నాయుడు మనసులోనో ఉంటే అవి బయటకు కనపడవు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిలా శ్రద్ధ పెట్టి భారత రాజ్యాంగ నిర్మాతకు అత్యంత అరుధైన గౌరవం కల్పించాలనే తపనతో అడుగులు ముందుకు వేస్తే.. ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం చరిత్రలో నిలిపోతుంది.