జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ ఆమంచి స్వాములు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పినట్లు లేఖని విడుదల చేశారు. ఆమంచి స్వాములు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి లేఖ రాస్తూ నాపై నమ్మకం నుంచి గతంలో నన్ను చీరాల నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా నియమించినందుకు ధన్యవాదాలు. కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల నేను చీరాల నియోజకవర్గ సమన్వయకర్తగా తప్పుకోదల్చుకున్నాను. దయచేసి మా అభ్యర్థులను అంగీకరిస్తారని భావిస్తున్నాను అంటూ లేఖ రాశాడు.
టిడిపి జనసేన అభ్యర్థుల ఎంపిక ఒక కొలికి రాకపోవడం. టిడిపి జనసేన కూటమిలో బిజెపితో జత కట్టే ప్రయత్నాలు చేస్తుండడం . జతకడుతున్న సమయంలో తనకి ఎక్కడ టికెట్ రాదో అని భావించి జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ తో రాజకీయ ప్రయాణం చేస్తే నట్టేట మునిగిపోతాం అని తను సన్నిహితులతో వాపోయారని సమాచారం .
టీడీపీ జనసేన పొత్తు తర్వాత పలు నియోజక వర్గాల్లో బలమైన నేతల్ని కోల్పోతున్న జనసేన ఇప్పుడు ఆమంచి స్వాములు రాజీనామాతో ఒక ఆర్ధిక అంగ బలం కలిగిన నాయకుడిని కోల్పోయింది. టీడీపీ జనసేన పొత్తుతో దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఇరు పార్టీల కార్యకర్తలు సిగపట్లు పడుతుండగా జనసేనతో పాటు టీడీపీ నుండి కూడా పలువురు నాయకులు రాజీనామాలు చేశారు. ఇహ బిజెపితో పొత్తు కోసం బాబు పవన్ ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తుంటే ఈ పొత్తుతో తమ స్థానాలకి ఎక్కడ ఎసరు వస్తుందో అని ఇప్పటికీ సీట్లు ప్రకటించని స్థానాల్లో టీడీపీ జనసేన ఆశావహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.