చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితీ అధ్యక్షుడు, అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు అంటూ ఓ వార్త పచ్చమీడియాలో చక్కర్లు కొడుతుంది.. ముందు నుండి చంద్రబాబు స్క్రిప్ట్ తూచా తప్పకుండా మీడియా ముందు చదివి వినిపించే కొలికపూడి ఇప్పుడు కొత్తగా టీడీపీ పార్టీ కండువా కప్పుకోవడం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది.
రాజధాని విషయంలో చంద్రబాబు డైరెక్షన్ లో ఈ కొలికపూడి నడిచాడు. కొలికపూడి మొదటి నుండి టీడీపీ మద్ధతుదారు అనే పేరుంది. ఈ విషయాన్ని ఎన్నోసార్లు వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు కూడా బహిర్గతం చేశారు.. డిసెంబర్, 2019 నుండి టీడీపీ వాదనలే కొలికపూడి నోటి నుండి బయటకు వస్తుండగా ఇప్పుడు కొత్తగా కండువా కప్పుకోవడం.. పార్టీ జెండాలు ఊపడం.. పసుపు చొక్కాలు వేసుకోవడం లాంటివి చేయడం ఎందుకు అన్నది వైఎస్సార్సీపీ అభిమానుల వాదన..
2024 ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ టీడీపీ పార్టీ ఇలాంటి రాజకీయ నాటకాలకు తెరతీసింది. ఎప్పటి నుండో టీడీపీ పార్టీ మద్దతుదారులుగా ఉన్న నేతలను పార్టీ కండువాలు కప్పుతూ టీడీపీ పార్టీలో భారీ చేరికలు అంటూ పచ్చ పత్రికల కథనాలతో ప్రజలను మభ్యపెట్టే ప్లాన్ టీడీపీ వేస్తుంది.