2019 లో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసాక వైద్య రంగంపై ప్రత్యేక శ్రద్ద పెట్టి విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి మౌలిక వసతులను కల్పించిన జగన్ ప్రభుత్వం ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ని నెలకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అందులో భాగంగానే వైద్య శాఖలో 54 వేల పోస్టుల్ని భర్తీ చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతీ ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించేలా ఫామిలీ డాక్టర్ విధానానికి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి శిశుమరణాల రేటు 12శాతంగా ఉండేది. కాగా సీఎం వైఎస్ జగన్ వైద్య రంగంపై ప్రత్యేక దృష్టిపెట్టి రాష్ట్రంలో మాతా శిశు మరణాల రేటును తగ్గించేందుకు అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టి అద్భుత ఫలితాలను సాధించారు. ఇందులో భాగంగా గర్భిణుల్లో పోషకార లోపం, రక్తహీనత విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, హైరిస్క్ గర్భిణులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా, రాష్ట్రం కమ్యూనిటీ స్థాయిలో రక్తహీనత మరియు అధిక ప్రమాదం ఉన్న గర్భిణుల ఆరోగ్య పరిస్థి తులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ మాత శిశు మరణాలను కట్టడి చేసేందుకు జగన్ సర్కారు కృషి చేస్తుంది.
శిశు మరణాల కట్టడిపై మరింత శ్రద్ధ పెట్టిన సీఎం జగన్ శిశు మరణాల రేటు, నవజాత శిశు మరణాల రేటు తగ్గించేందుకు 12 ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్లు, 5 నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను ప్రారంభించనున్నారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే అవసరమైన మానవ వనరులను మెరుగుపర్చడంతో పాటు మందులు, వినియోగ వస్తువుల కోసం బడ్జెట్ కేటాయింపులను పెంచింది. రక్తహీనత మరియు అధిక ప్రమాదం ఉన్న హైరిస్క్ గర్భిణులకు ప్రతినెలా సిహెచ్వోలు కౌన్సెలింగ్ ఇస్తూ ఉండటం, వారిని నిరంతరం గమనిస్తూ ఉండటంతో ప్రజారోగ్యంపై జగన్ ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా అంతేకాకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇవ్వడంతో 12% ఉన్న శిశు మరణాల రేటు ప్రస్తుతం 6 శాతానికి పడిపోయింది. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తున్న జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధికి పైన కనబడుతున్న గణాంకాలే నిదర్శనం గా చెప్పొచ్చు .