వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రజారోగ్యానికి పెద్దపీట వేసే క్రమంలో ఏపీ వైద్యారోగ్య శాఖలో ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. మొత్తం 424 పోస్టుల భర్తీకి మంగళవారం మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
వీటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్, లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేయన్నుట్లు ఆ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. అందులో సూపర్ స్పెషాలిటీ విభాగంలో 169, బ్రాడ్ స్పెషాలిటీ విభాగంలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులున్నాయి. కాగా 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఫిబ్రవరి 6న ఓల్డ్ జీజీహెచ్, హనుమాన్పేట, విజయవాడ డీఎంఈ కార్యాలయంలో వాక్ ఇన్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అలాగే బ్రాడ్ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం https://dme.ap.nic, https://apmsrb.ap.gov.in/msrb
వెబ్సైట్లను పరిశీలించాలని బోర్డు కోరింది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు నడుం బిగించిన విషయం తెలిసిందే. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఐదు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరో ఐదింటిని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.