108, 104 సేవలు తెలుగుదేశం హయాంలో నిర్వీర్యమయ్యాయి. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 104 వైద్య సేవలను పల్లెముంగిటకే సకాలంలో తీసుకువచ్చింది. అవి ప్రతి నెలా రెండుసార్లు గ్రామాలను సందర్శిస్తూ వైద్యసేవలు అందిస్తున్నాయి.
గ్రామాల్లో మంచానికే పరిమితమైన వృద్ధులు, దివ్యాంగులతోపాటు అనారోగ్య బాధితులకు 104 వాహనాల సంచార వైద్యసేవలు వరంలా మారాయి. ఎటూ వెళ్లాల్సిన అవసరం లేకుండానే సొంతూరులోనే మెరుగైన చికిత్స చేయించుకుంటున్న పరిస్థితులున్నాయి. ప్రతి మండలానికి 104 వాహనం అందుబాటులో ఉండేలా ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో అరబిందో ఎమర్జెన్సీ మెడకల్ సర్వీసెస్ సంస్థ నిర్వహణ బాధ్యులతో ఈ వాహనాలు నడుస్తున్నాయి. గతంలో కేవలం 676 వాహనాలు ఉండేవి. అయితే అరకొరగా గ్రామాలకు వెళ్లేవి. జగన్ సమీక్షలు నిర్వహించి 2021లో 432 కొత్త వాటి కొనుగోలుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీంతో సంఖ్య 1,108కి చేరింది. అవి ముందస్తు ప్రణాళిక ప్రకారం ప్రతి గ్రామానికి వెళ్లేలా రూట్మ్యాప్ నిర్వహించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అనుసంధానించారు.
పీహెచ్సీ పరిధిలో గ్రామాల్లో ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4.30 వరకు 104 వాహనం అందుబాటులో ఉంటుంది. 104 వైద్యుడితోపాటు సంబంధిత పీహెచ్సీ డాక్టర్, ఏఎన్ఎం, ఆశా కార్యకర్త అక్కడే ఉంటారు. మధ్యాహ్నం వరకు ఆయా గ్రామాల సచివాలయాల వద్ద రోగులకు వైద్యసేవలందిస్తున్నారు. అనంతరం నడవలేని వారు, మంచాన పడిన వృద్ధులు, దివ్యాంగులు, ఇతర రోగులకు ఇళ్లవద్దకే వెళ్లి సేవలందిస్తున్నారు. 104లో ఉండే డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రతి రోగి వివరాలను ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులో పొందుపరుస్తున్నారు. ఈ వివరాలను టెలీ మెడిసిన్ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు అనుసంధానించి భవిష్యత్లో మెరుగైన వైద్యసేవలందిస్తున్నారు. రోగికి మెరుగైన వైద్యసేవలు అవసరమైతే పీహెచ్సీ, సీహెచ్సీ, జిల్లా ఆస్పత్రులు, ఆరోగ్య నెట్వర్క్ ఆస్పత్రిలకు రెఫర్ చేస్తున్నారు. వారిని తరలించే బాధ్యతలను స్థానిక ఏఎన్ఎంలు నిర్వహిస్తున్నారు.