చెప్పాడంటే చేస్తాడంతే… అనే పేరున్న జగన్, తన మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలు వేటినీ మరిచిపోకుండా పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగానే కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా బుధవారం మూడోవిడతలో వైద్య శాఖలోని 397 ఎంపీహెచ్ఎ, ల్యాబ్ టెక్నీషి యన్, ఫార్మసిస్ట్లను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసిం ది. గత వారం రెండు విడతల్లో 1,977 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. తాజా ఉత్తర్వులతో మొత్తం మూడు విడతల్లో 2,374 మందిని క్రమబద్ధీకరించినట్టైంది.
రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేపడతామని 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ నెరవేర్చడమే లక్ష్యం గా పెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఏపీ రెగ్యులరైజేషన్ ఆఫ్ సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్-2023 చట్టం తీసుకొచ్చారు.
ఈ చట్టం కింద 2014 జూన్ రెండోతేదీకి ముందు నియమితులై, ప్రస్తుతం కొనసాగుతున్న వారి సర్వీసు క్రమబద్ధీకరిస్తున్నారు. ఏళ్ళ తరబడి కాంట్రాక్టు ఉద్యోగులుగా కొనసాగుతున్న వందలాది మంది ఉద్యోగులకు ఇది శుభవార్త కానుంది. ఈ క్రమం లోనే వైద్యశాఖలోని డీఎంఈ, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమం (డీపీహెచ్), ఆరోగ్య కుటుంబ సంక్షేమం (సీఎఫ్ డబ్ల్యూ), ఆయుష్ విభాగాల్లోని అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులం దరినీ రెగ్యులరైజ్ చేస్తున్నారు.