ఇప్పటికి 26 ఏళ్ల క్రితం అప్పటికి రెండేళ్ల చంద్రబాబు పాలనలో స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయానికి తూట్లు పొడుస్తూ, పేద ప్రజల ధన, మాన, ప్రాణాలను కొల్లగొడుతూ మద్య నిషేదానికి ముందూ తర్వాత నాటి టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, బాబు బంధువులు సహా సిండికేట్ గా ఏర్పడి తమ అన్నదమ్ములు, బంధువుల పేరిట కల్తీ మద్యం, అక్రమ మద్యం, నాటు సారా వ్యాపారాలతో రాష్ట్రాన్ని ఎలా ముంచెత్తారో, వందల వేల కోట్లు ఎలా కొల్లగొట్టారో సాక్ష్యాదారాలతో ప్రపంచానికి తెలిపిన రోజు .
ఆనాడు వార్త దినపత్రిక మద్యం మాఫియా పై నిప్పులు కక్కుతూ రాసిన నిజాలు యధాతధంగా మీకోసం …
మద్యం మాఫియాలు రాష్ట్ర పాలకులకు చుట్టాలయ్యాయి .
అక్రమ మద్యం వ్యాపారం అధికార పార్టీకి ఆత్మ బంధువయ్యింది. కోట్ల రూపాయల స్మగ్లింగ్ ఆదాయం ముందు ప్రభుత్వ పాలన చేతులు కట్టుకొంది. మూడేళ్లుగా రాష్ట్రంలో సాగిన మద్య నిషేధం విధింపు, సడలింపు ముసుగులో చీకటి వ్యాపారం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ఊరూరికి పాకిపోయిన మధ్యం దొంగ వ్యాపారం మండలాలు, నియోజకవర్గాలు, పట్టణాలు, జిల్లాలే సరిహద్దులుగా చేసి రాష్ట్ర పరిపాలననే శాసించగల స్థాయికి ఎదిగిపోయింది.
ఇప్పటి పాలన మద్యం మాఫియాల పడగ నీడలలో చల్లగా నడిచిపోతున్నది. పరిపాలనా యంత్రాంగం మాఫియాల అడుగులకు మడుగులు ఒత్తుతోంది . అక్రమ మద్యం వ్యాపారులకు చెందిన ఖరీదైన కార్లు కొందరు మంత్రులు, శాసన సభ్యుల వాడకంలోకి వచ్చాయి . కొందరు అమాత్యుల అధికార పర్యటనలు ప్రభుత్వ కార్లలో కాకుండా మద్యం మాఫియాల విలాస వాహనాలలో సాగిపోతున్నాయి . మద్యం స్మగ్లర్ల ఇష్టాయిష్టాల పై ఎక్సయిస్, పోలీస్ శాఖదికారుల జీవనం గడిచిపోతున్నది.
మాఫియాలు తలుచుకొంటే ఏ అధికారి తల రాతనైనా మార్చగలరు . మంత్రులు ఎమ్మెల్యేలను మంచినీరు తాగించగలరు. కొందరు శాసన సభ్యులు మంత్రులు ప్రత్యక్షంగా మద్యం మాఫియాలలో సభ్యత్వం పొంది ఉన్నారు. మరికొందరు అధికారం ముసుగులో స్మగ్లర్లను పెంచి పోషిస్తున్నారు.
ప్రభుత్వానికి అందిన మద్యం వ్యాపారుల జాబితా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 22 మంది శాసన సభ్యులు ప్రత్యక్షంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విదంగా ఒక పార్లమెంట్ సభ్యుడు, ముగ్గురు మంత్రుల రక్త సంబంధికులు మద్యం సారా వ్యాపారంలో మునిగి తేలుతున్నారు. వీరు గాక ఎక్సయిజ్ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, దాదాపు 80 మంది శాసన సభ్యులు అయిదారుగురు మంత్రుల అండతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 360 మంది ప్రత్యక్షంగానూ, మరి కొన్ని వందల మంది పరోక్షంగాను అక్రమ మద్యం వ్యాపారం నిర్వహించడం ద్వారా లక్షల నుండీ కోట్ల రూపాయలు గడిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి . రాష్ట్రంలో దొంగ వ్యాపారన్ని అరికట్టగలిగితే ప్రభుత్వ ఖాజానాకు దాదాపు అదనంగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఏటా ఆదాయం సమకూరుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి .ఆ మొత్తాన్ని మద్యం స్మగ్లర్లు దోపిడీ చేసి జేబులు నింపుకొంటున్నారు. గత మూడేళ్ళల్లో ఒక్కొక్కరు కోటి రూపాయల నుండీ వందల కోట్లు సంపాదించిన స్మగ్లర్లు సైతం ఉన్నారని చెబుతున్నారు.
అధికారిక వర్గాల నివేదిక ప్రకారం సీఎం రమేష్ అనే తెలుగుదేశం నాయకుడు హైదరాబాద్లో అయిదు మద్యం దుకాణాల ద్వారా తన చీకటి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఇక్కడే కాకుండా అతని తండ్రీ మునుస్వామి నాయుడు, అతని సోదరుడు సీఎం ప్రకాష్ లు సంయుక్తంగా చిత్తూరు, కడప జిల్లాలలో అనేక మద్యం షాపుల ద్వారా అక్రమ మధ్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకొని కోట్లాది రూపాయల సంపాదనకి పాల్పడి ప్రభుత్వాన్ని లూటీ చేస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు.
చిత్తూరు, కడప జిల్లాలకు బెంగళూరు, చెన్నై నగరాలకి మంత్రులు ఎవరు పర్యటనలకు వెళ్లినా సీఎం రమేష్ కి చెందిన విలాసవంతమైన కార్లలో తిరుగుతూ ఖరీదైన హోటళ్ళలో ఆయన ఖర్చులతోనే గడుపుతారని నివేదికలు చెబుతున్నాయి . హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు సీఎం రమేష్ అతిధులుగా కొందరు మంత్రులు తిరగటం పర్యటన సందర్భంగా ఆయన ఖరీదైన ఏసీ కార్లను వాడటం చూసి ఎక్సయిజ్, పోలీస్ అధికారులు ఎవ్వరూ ఆయన వ్యాపారన్ని అడ్డుకోరనే విషయాన్ని నివేదికలలో గుర్తు చేయటం విశేషం .
అంతేగాక హైదరాబాద్ స్థావరంగా అనేక మంది స్మగ్లర్లు రాష్ట్రంలోని దాదాపు పదిహేను జిల్లాలలో అక్రమ మద్యం వ్యాపారన్ని నిర్వహిస్తున్నారని స్మగ్లర్లకు రాజధాని నగరం పెట్టని కోటగాను, ప్రభుత్వ యంత్రాంగంచే తగిన రక్షణ, ఆశీర్వాద తతంగాలతోనూ వ్యాపారం సాగిపోతుందని అందులో పేర్కొన్నారు. దాదాపు ఏటా మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఇక్కడి ప్రభుత్వానికి రాబడి తగ్గిపోతున్నదని గత మూడేళ్లుగా ఇలా వ్యాపారం సాగిపోతున్నదని ప్రభుత్వానికి చెందిన నివేదికలు చెబుతున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో ఇరవై మంది స్మగ్లర్లు, మెదక్ జిల్లాలో 13 మంది, నిజామాబాద్ జిల్లాలో పదిహేడు మంది, మెహబూబ్ నగర్ జిల్లాలో 18 మంది, నల్గొండ జిల్లాలో 20 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 9 మంది, కరీంనగర్ జిల్లాలో 7 గురూ, వరంగల్ జిల్లాలో 32 మంది, గుంటూరు జిల్లాలో 15 మంది, ప్రకాశం జిల్లాలో ఏడుగురు, కృష్ణా జిల్లాలో 11 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 20 మంది పచ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది, విశాఖ జిల్లాలో ఆరుగురు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో నలుగురు, అనంతపురం జిల్లాలో 17 మంది, చిత్తూరు జిల్లాలో 16 మంది, కడప జిల్లాలో 11మంది, కర్నూల్ జిల్లాలో 36 మంది, నెల్లూరు జిల్లాలో 5గురూ, అక్రమ మద్యం వ్యాపారంలో స్మగ్లర్లుగా ప్రభుత్వానికి అందిన నివేదికలో చోటు చేసుకొన్నారు.
శాసన సభ్యుల బంధువులు అనుచరులు….
నివేదికలో చోటు చేసుకొన్న స్మగ్లర్లు అందరూ దాదాపు కొందరు మంత్రులు, అధికార పార్టీ శాసన సభ్యుల అండదండలతో అక్రమ వ్యాపారం నడుపుతున్న వారే, ఈ స్మగ్లర్లు అధికార పార్టీలో సభ్యులు నాయకులుగా కూడా చెలామని అవుతున్నారని నివేదిక చెబుతుంది .
అధికారుల నుంచి అరెస్టులకు ఆదేశం.
అధినాయకుని జోక్యంతో ఉత్తర్వుల నిలిపివేత..
ఇదిలా ఉండగా ప్రభుత్వ జాబితాలలో ఉన్న 22 మంది శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యుడు భూమా నాగిరెడ్డి మినహా రాష్ట్రంలోని మిగిలిన దాదాపు మూడు వందల యాభై మంది మద్యం స్మగ్లర్ల జాబితాలను పంపుతూ వారిని పిడి చట్టం కింద అరెస్ట్ చేయవలసిందిగా ప్రభుత్వం 1997ఆగష్టు 30 వ తేదీన cr no 3124/97/dpe /b 5
ఉత్తర్వులను అన్ని జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లకు పంపడం జరిగింది. ఆనాటి నుండీ నేటి వరకూ స్మగ్లింగ్ విచ్చలవిడిగా సాగిపోతూనే ఉన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది. ఇలా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులే అన్ని జిల్లాల్లో పెండింగ్ ఫైల్స్ లో చేరటం వెనక చంద్రబాబు జోక్యం ప్రధాన కారణమన్నది జగమెరిగిన సత్యం .
ఆ ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులు, పార్లమెంట్ సభ్యుల పేర్లు, వివరాలు మరుసటి భాగంలో