సహాయం కోసం వచ్చే ఆపన్నులను ఆదుకోవడంలో జగనన్న శైలి ప్రత్యేకమని చెప్పొచ్చు. తాజాగా భీమవరం పర్యటనలోనూ తన మంచి మనసును సీఎం జగన్ మరోసారి చాటుకున్నారు. అనేక ఇబ్బందులతో బాధపడుతున్న వారి సమస్యలను విని అప్పటికప్పుడే సాయం చేయాలని ఆదేశించడంతో దాదాపు గంటలోనే తొమ్మిది మంది బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున తొమ్మిది లక్షల రూపాయల చెక్కులను అధికారులు పంపిణీ చేసారు.
అనారోగ్యంతో పాటు ఇతర ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న తొమ్మిదిమంది జగనన్న విద్య దీవెన పథకం నిధులను విడుదల చేసేందుకు భీమవరం పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ ని కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. దాంతో మానవత్వంతో స్పందించిన ముఖ్యమంత్రి జగన్ సదరు బాధితులను తక్షణమే ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సమస్యలు విన్నంవించుకున్న 9 మంది అర్జి దారులకు లక్ష రూపాయలు చొప్పున చెక్కులను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డి తో కలిసి అందజేశారు.
చెక్కులు అందుకున్న వారి వివరాలు..
కడలి నాగలక్ష్మి, తండ్రి కడలి సత్యనారాయణ, ఎల్ బి చర్ల గ్రామం, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా భూ పరిష్కారంలో పరిహారం అందజేశారు
ఎల్లమల్లి అన్నపూర్ణ, 29వ వార్డు, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా.. భర్త చనిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం వల్ల ఆర్థిక సాయం
చిల్లి సుమతి, బోడ్డి పట్ల గ్రామం, ఎలమంచిలి మండలం, పశ్చిమగోదావరి జిల్లా,.. బాబుకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఆర్థిక సహాయం
కంతేటి దుర్గ భవాని, వైఫ్ ఆఫ్ నాగ వెంకట రవితేజ, శ్రీరామవరం, దెందులూరు మండలం, ఏలూరు జిల్లా. వైద్య సహాయం నిమిత్తం ఆర్థిక సాయం
తేతలి గీత, వైఫ్/ఆఫ్ లేట్ టి ఎస్ ఎస్ ఎన్ రెడ్డి, ఫైర్ స్టేషన్ సెంటర్, ఏలూరు, ఏలూరు జిల్లా.. భర్త మరణించడం వల్ల ఆర్థిక సహాయం
అరుగుల లాజరస్, పూళ్ళ గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా కుమారునికి వైద్య సహాయం నిమిత్తం ఆర్థిక సాయం
అందుగుల లాజర్, పూళ్ళ గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా కుమారునికి వైద్య సహాయం నిమిత్తం ఆర్థిక సాయం
గుడాల అపర్ణ జ్యోతి, తిరుపతి పురం, అత్తిలి, పశ్చిమగోదావరి జిల్లా. వైద్య సహాయం నిమిత్తం ఆర్థిక సాయం
కోరాడ వీర వెంకట సత్యనారాయణ, పొలసానపల్లి గ్రామం, భీమడోలు మండలం, పశ్చిమగోదావరి జిల్లా.. వైద్య ఖర్చులు నిమిత్తం సహాయం అందజేయడం జరిగింది.