“అంత నాడు లేదు, ఇంత నాడు లేదు, సంత నాడు పెట్టింది ముంతంత కొప్పు” అన్న చందాన ఉంది అచ్చెన్నాయుడు వ్యవహారం. ఇప్పుడు ఆయనకి హటాత్తుగా మాచర్ల అసెంబ్లీ నియోజక వర్గం రౌడీయిజానికి అడ్డాగా, అధికార దుర్వినియోగం పాల్పడే ప్రాంతంగా కనపడుతుంది.
ఈ విషయమై, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం లో అధికార పార్టీ అరాచకాలపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళవారం లేఖ రాశారు కూడా. ఏకంగా పోలింగ్ బూత్లు ఆక్రమణకు గురయ్యే మండలాలు, గ్రామాలను లేఖలో ప్రస్తావించేసారు.
త్వరలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్
విడుదల కానున్న నేపధ్యంలో ఈ నియోజకవర్గంలో ప్రత్యేకమైన నిఘా పెట్టాలనికోరారు. 2009, 2014, 2019 లలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ డేటాను విశ్లేషించాలని విజ్ఞప్తి చేశారు. 2021లో జరిగిన స్థానిక సంస్థలు, మునిసిఫల్ ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్ధులను నామినేషన్లు వేయనీయలేదని పేర్కొన్నారు.
మాచర్ల, వెల్దుర్తి, కారంపూడి, దుర్గి, రెంటచింతల మండలాల్లో నమోదైన నామినేషన్ల వివరాలు ఎస్ఈసీకి పంపారు. మాచర్లలో అధికారపార్టీ చెందిన వారు హత్యలు, దొమ్మి, దోపిడీలు, బెదిరింపులకు పాల్పడ్డారని నిజాలను వక్రీకరిస్తూ ఉదహరించారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామచంద్రారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట రామిరెడ్డిలు ఆడమన్నట్లు అధికారులు, పోలీసులు ఆడుతున్నారన్నారంటూ ఎమ్మెల్యే మరియు పోలీసులపై నిందారోపణలు చేసారు. మాచర్లలోని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, రాబోయే సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తగు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు ఎస్ఈసీని కోరారు.