ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 67 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఓపెనర్లు పెను విధ్వంసం సృష్టించారు , స్టేడియం అన్ని వైపులా సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించారు , కేవలం పవర్ ప్లే 6 ఓవర్లలోనే 125 పరుగులు సాధించి సరికొత్త రికార్డ్ ను నెలకొల్పారు . ట్రేవిస్ హెడ్ 32 బంతుల్లో 89 పరుగులు ( 11 ఫోర్లు , 6 సిక్స్ లు ) అభిషేక్ శర్మ 12 బంతుల్లో 46 పరుగులు ( 2 ఫోర్లు , 6 సిక్స్ లు ) లతో విధ్వంసం సృష్టించారు. వీళ్లిద్దరూ వెనుదిరిగాక తరువాత వచ్చిన బ్యాటర్లు సరిగా నిలదొక్కుకోకపోయినా నితీష్ రెడ్డి 37 పరుగులు , షబాజ్ 59 పరుగులతో హైదరాబాదు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఢిల్లీ బౌలర్లలలో కులదీప్ యాదవ్ 4 వికెట్లు , అక్షర్ పటేల్ , ముఖేష్ కుమార్ చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 199 పరుగులు చేసి ఆలౌటైంది, ఓపెనర్లు విఫలమైనా జాకే ఫ్రాసెర్ 18 బంతుల్లో 68 పరుగులు ఉన్నంత సేపు మెరుపు బ్యాటింగ్ చేసాడు , అభిషేక్ పోరెల్ 42 పరుగులు , పంత్ 44 పరుగులు చేసారు , మిగిలిన బ్యాటర్లు విఫలమవడంతో ఢిల్లీ 199 పరుగులకే ఆలౌట్ అయ్యి ఓటమిని మూటకట్టుకుంది.
హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 4 వికెట్లు , నితీష్ రెడ్డి 2 వికెట్లు , మయాంక్ మార్కండే 2 వికెట్లు , భువనేశ్వర్ కూమార్ , వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీసుకున్నారు. ట్రేవిస్ హెడ్ కి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది