2024-25 విద్యా సంవత్సరంలో బోధన ప్రమాణాలు మరింత పెరగాలని వాటికి అనుగుణంగా వచ్చే వేసవి సెలవులను ఉపయోగించుకోవాలని విద్యాశాఖ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయులకు సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విదేశాలతో పోటీపడే విద్య వ్యవస్థని తీసుకొచ్చామని దానికి అనుగుణంగా ఉపాధ్యాయులకి ప్రభుత్వం శిక్షణ ఇస్తున్నప్పటికీ ఉపాధ్యాయులు మరింత సమయం కేటాయించి వివిధ మార్గాల ద్వారా పాఠ్యాంశాలపై లోతైన శోధన చేసి సిద్ధమవ్వాలని కోరారు. ఈ నెల 23న 2023 2024 విద్యా సంవత్సరం ముగియడం, కొత్త […]