పాయసం ముద్దలాగా కాకుండా పలావులా పొడిపొడిగా కావాలంటున్న ఈనాడు. ప్రభుత్వం నాణ్యత లేని బియ్యాన్ని సరఫరా చేస్తున్నందు వలన ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం రుచికరంగా లేదని తీపి పొంగలి ముద్దలా ఉందని అందుకే కొందరు పిల్లలు ఇంటి వద్ద నుండీ భోజనం తెచ్చుకొన్నారంటూ ఒక వార్త ప్రచురించింది ఈనాడు పత్రిక. నిజానికి వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మాకంగా తీసుకొన్న పధకం జగనన్న గోరుముద్ద. ఈ పధకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకి దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా […]
రోజూ జగన్ సర్కారుపై బురదజల్లేందుకు వెంపర్లాడే ఈనాడు పత్రిక కాపులకు ఇచ్చే సీట్ల విషయంలో కూడా పచ్చద్దాల రాతలతో మాయ చేసే ప్రయత్నం చేసింది. పవన్ కల్యాణ్ ప్రభావం నుంచి కాపు ఓట్లను చీల్చేందుకు, జగన్ ప్రభుత్వం ముద్రగడ, వంగవీటి కుటుంబాలపై దృష్టి పెట్టి పద్మనాభం లేదా ఆయన కుమారుడికి కాకినాడలో టికెట్ కేటాయించి వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ టికెట్ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఈనాడు రాసుకొచ్చింది. ఈనాడు కథనంలోని సారాంశం ఏమంటే కాపుల ఓట్లు […]
ప్రతీరోజు ప్రభుత్వంపై అసత్య కథనాలతో విష ప్రచారానికి తెగబడే ఈనాడు పత్రిక మరోసారి తన మార్క్ పచ్చ రాతలతో రెచ్చిపోయింది. విమానయాన రంగాన్ని ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ‘రెక్కలు విరిచారు’ అంటూ బురదజల్లే ప్రయత్నం చేసింది. కానీ విమానయాన రంగంలో జగన్ సర్కారు చేసిన అభివృద్ధిని దాచిపెట్టి ఓ పార్టీకి లబ్ది చేకూర్చే కథనాలను వండి వార్చింది. ఈనాడు కథనంలో పచ్చ రాతలను పక్కనబెట్టి వాస్తవాలను పరిశీలిస్తే విమానయాన రంగంలో చంద్రబాబు హయాంలో కంటే జగన్ […]
మనసులేని మామ అనే కథనంతో సాంఘిక, గిరిజన సంక్షేమ హాస్టల్స్ లో సరి అయిన వసతులు లేవంటూ ఈనాడు ఓ అసత్య కథనం ప్రచురించింది. నిజానికి 2019 లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక విద్యా విధానంతో పాటు విద్యార్ధులకు కల్పించే సౌకర్యాలలో కూడా చాలా మార్పు వచ్చింది. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు(హాస్టల్స్)లో విద్యార్థులు మరింత క్షేమంగా ఉండేలా ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సన్నాహక సమావేశాలు […]
జరిగింది ఒకటైతే దాన్ని మరొకలా చిత్రీకరించే రామోజీ మరోసారి అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసాడు. జర్నలిజం విలువలను తుంగలో తొక్కుతూ అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలిచిన జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి దిగడం రామోజీ ఓ రాజకీయ పార్టీకి లబ్ది కలిగించేలా రాతలు రాస్తున్నారనడానికి నిదర్శనం. నిజానికి 10.37లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు 930 కోట్లు చెల్లించి జగన్ ప్రభుత్వం ఆదుకుంటే ఆ విషయాన్ని కప్పిపెడుతూ అసలు అగ్రిగోల్డ్ బాధితులను జగన్ […]
టీడీపీ హయాంలో బడులు తెరిచాక అక్టోబరు నవంబరు నెలలు వచ్చినా పాఠ్య పుస్తకాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా పేదపిల్లలను అష్టకష్టాలు పెట్టిన టీడీపీ ప్రభుత్వంపై ఆనాడు ఒక్క కథనం కూడా రాయలేదు. ఈ ఈనాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బడులు ప్రారంభించిన మొదటి రోజునే విద్యార్థుల చేతిలో విద్యాకానుక పెడుతున్నప్పుడు కూడా మెచ్చుకోలుగా ఒక్కవార్త రాయలేదు.. కానీ ఆ నిధులు ఎవరి జేబులోకి అంటూ వార్త రాసి వైఎస్సార్సీపీ పాలనపై అక్కసును బయటేసుకుంది. జగనన్న విద్యా కానుక ద్వారా […]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చదువుకునే పేద పిల్లలు మరింత ఉన్నంతగా రాణించాలని, అంతర్జాతీయ స్థాయిని అందుకోవాలన్న సమున్నత లక్ష్యంతో అందిస్తున్న ట్యాబుల పైన ఈనాడు రాసిన వికృత రాతలు. ప్రభుత్వం పిల్లలకు ఇస్తున్న ట్యాబుల వల్ల చదువులకు నష్టం జరుగుతుందంటూ, ట్యాబులపై తల్లీదండ్రుల విముఖత అన్నట్లు కథనాలు ప్రచురించింది. అయితే ఇదే ప్రధమం కాదు.. పేదపిల్లలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక సంస్కరణలపై నిత్యం ఈనాడు […]
వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. వ్యవసాయాన్ని కించపరిచేలా మాట్లాడి రైతులను ఏనాడూ పట్టించుకోలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. 14 ఏళ్ల పాలనా కాలంలో వ్యవసాయానికి చంద్రబాబు తీసుకున్న చర్యలు ఏంటి? విపత్తుల సమయంలో రైతులకు చంద్రబాబు ఇచ్చిందేమిటని తీవ్ర విమర్శలు చేశారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు సీఎంగా చంద్రబాబు పనిచేసిన 14 ఏళ్లలో అన్నదాతలకు చంద్రబాబు చేసిన మేలు ఏమిటి? రైతులు సమస్యలు చెప్పుకోవటానికి వెళ్తే బుల్డోజర్లతో […]