చంద్రబాబు దేహమంతా దళితుల రక్తంతోనే తడిసిందని జూపూడి ప్రభాకర్ రావు తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు . కారంచేడు,చుండూరు,పదిరికుప్పం బాబు సామాజికవర్గ దాష్టీకాలేనని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జూపూడి ప్రభాకర్రావు ఆరోపించారు. తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కారంచేడులో ఏరులై పారింది దళితుల రక్తం కాదా, దళితుల్ని ముక్కలుగా నరికి శవాల్ని మూటగట్టిన రక్తచరిత్ర మీది కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో దళితులకు అడుగడుగునా అవమానాలే […]