లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో బీజేపీ మేనిఫెస్టోను ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ రిలీజ్ చేశారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది బృందం మేనిఫెస్టోను రూపొందించింది. 14 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు బీజేపీ […]