ఐపీఎల్ 2024 లో భాగంగా ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది . ఈ సీజన్ లో ఇది 11వ మ్యాచ్ , లక్నో లో భారత రత్న అటల్ బిహారీ వాజపేయి ఏకన స్టేడియం వేదిక కానుంది
లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ చేతిలో ఓడిపోయిన లక్నో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని కోరుకుంటుంది, హోం గ్రౌండ్ కావడం కెప్టెన్ కేఎల్ రాహుల్ , పూరన్ ఫామ్ లో ఉండటం ఈ జట్టుకి కలిసి వచ్చే అంశం, పంజాబ్ కింగ్స్ మొదటి మ్యాచ్ లో గెలిచినా తరువాత మ్యాచ్ ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది , ఈ మ్యాచ్ లో గెలిచి మళ్ళీ జట్టులో ఆత్మవిశ్వాసం నింపుకోవాలని చూస్తున్నారు
ఈ స్టేడియం పిచ్ బౌలింగ్ కి అనుకూలముగా ఉంటుంది , ఈ పిచ్ లో కనీస యావరేజ్ స్కోర్ 148 కావడం విశేషం,
ఇరు జట్లు ఇప్పటిదాకా 3సార్లు తలపడగా . 2 సార్లు లక్నో , 1 సారి పంజాబ్ గెలిచాయి