నేడు ఐపీఎల్ 2024 నేపథ్యంలో లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటల నుంచి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది,ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు రెండవ క్వాలిఫయర్ లోకి ప్రవేశిస్తుంది,
లీగ్ దశలో రెండు జట్ల ప్రదర్శన చూస్తే రాజస్థాన్ రాయల్స్ మొదటి 9 మ్యాచ్లలో 1 మాత్రమే ఓడిపోయింది. అయితే తదుపరి 4 మ్యాచ్లలో ఓటమి చవిచూసింది, 1 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇంకో వైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి 8 మ్యాచ్ల్లో 1 గెలిచి ప్లేఆఫ్కు చేరడం కష్టమే అనే స్టేజి నుంచి అద్భుత ప్రదర్శనతో వరుసగా 6 మ్యాచ్ లు గెలిచి ప్లేఆఫ్కు చేరుకుంది
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 31 మ్యాచ్లు జరగ్గా, ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15 మ్యాచ్ లు , రాజస్థాన్ 13 మ్యాచ్ లలో విజయాలు సాధించగా, 2 మ్యాచ్లు ఫలితం లేకుండా పోయాయి. ఈ సీజన్లో రెండు జట్ల మధ్య జరిగిన ఒకే ఒక్క మ్యాచ్లో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది.
ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా) :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, లాకీ ఫెర్గూసన్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.
రాజస్థాన్ రాయల్స్ :
సంజూ శాంసన్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), టామ్ కోహ్లర్-కాడ్మోర్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, నాంద్రే బెర్గర్, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్.