ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు హైదరాబాద్ పై 35 పరుగుల తేడాతో విజయం సాధించింది , వరుస ఓటముల తరువాత ఈ విజయం ఆ జట్టులో ఆత్మవిశ్వాసం నింపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మ్యాచ్ వివరాల్లోకి వెళితే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలలో 7 వికెట్లు కోల్పోయి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కింగ్ విరాట్ కోహ్లీ ఎప్పటీలానే అర్థ సెంచరీ చేసి జట్టుకు అవసరమైన తన సహకారం అందించాడు, రజత్ పాటిదార్ దూకుడుగా ఆడటంతో తను ఉన్నంత సేపు స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది, కేవలం 20 బంతుల్లో 50 పరుగులతో అధ్బుతమైన బ్యాటింగ్ చేసాడు, కెమరూన్ గ్రీన్ 37 పరుగులు, డూప్లిసిస్ 25 పరుగులు చేసారు
హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ 3 వికెట్లు , నటరాజన్ 2 వికెట్లు , మార్కాండే , కమ్మిన్స్ చెరో వికెట్ తీసుకున్నారు
లక్ష్యచేధనకు బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆదిలోనే గట్టి దెబ్బతగిలింది, భీకర ఫామ్ లో ఉన్న హెడ్ 1 పరుగుకే వెనుదిరిగాడు , తరువాత వచ్చిన మార్కరమ్ , నీతీష్ రెడ్డి కూడా వెంట వెంటనే పెవిలియన్ చేరారు , అభిషేక్ శర్మ 31 పరుగుల చేసి వెనుదిరిగాడు , పవర్ ప్లే లోనే హైదరాబాద్ జట్టు 4 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ కమ్మిన్స్ 31 పరుగులు , షాబాజ్ అహ్మద్ 40 పరుగులు చేసిన జట్టు విజయానికి చేరుకోలేకపోయింది , సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓనర్లలలో 171 పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమి పాలైంది.
ఆర్సీబీ బౌలర్లలో గ్రీన్ , కరణ్ శర్మ , స్వాప్నీల్ చెరో రెండు వికెట్లు తీసుకోగా విల్ జాక్స్ , యష్ డయాల్ చెరో వికెట్ తీసుకున్నారు. రాజద్ పాటిదార్ కి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది