నేడు ఐపీఎల్ 2024 సీజన్ లో 32 వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్ లో ముందడుగు కోసం ఈ మ్యాచ్ లో ఇరు జట్లు ఖచ్చితంగా గెలుపు కోసం తీవ్రంగా పోరాడతారు, ఇరు జట్ల అంచనా ఆటగాళ్ళని, బలాబలాలను చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ కన్నా గుజరాత్ టైటాన్స్ మరింత పటిష్టంగా కనిపిస్తుంది .
టాస్ ఎవరు గెలిచినా ఎక్కువ శాతం ఛేజింగ్ చేయడానికి మొగ్గు చూపుతారు,ఈ రెండు జట్లు ఇప్పటివరకు 3 సార్లు తలపడగా రెండు సార్లు గుజరాత్ టైటన్స్ , ఒకసారి ఢిల్లీ క్యాపిటల్స్ విజయాలు సాధించాయి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే ఇరు జట్ల ఐపీఎల్ రికార్డు సమం అవుతుంది.
ప్లెయింగ్ ఎలెవన్ ( అంచనా )
ఢిల్లీ క్యాపిటల్స్ :
డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, పృథ్వీ షా , రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జే, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్.
గుజరాత్ టైటాన్స్ :
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుబ్మన్ గిల్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయి, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్.