ఎల్లో మీడియాలో ఒక భాగంగా ఉన్న ఆంధ్రజ్యోతికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చురకలంటించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం.. కాంగ్రెస్ గెలవడంతో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ను పట్టలేకపోతున్నారు. ముఖ్యంగా రేవంత్రెడ్డి సీఎం అయిన తర్వాత రాధాకృష్ణ అంతా తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక కొంతకాలం స్నేహం కొనసాగించి ఆ తర్వాత వేరే స్టాండ్ తీసుకున్నాడు. తన పత్రిక, మీడియాలో రేవంత్ను హైలెట్ చేస్తూ.. మిగిలిన వారిని డీ గ్రేడ్ చేసి చూపుతున్నారని విమర్శలున్నాయి. సీఎం పదవి రేస్లో ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులున్నా ఆఖరికి రేవంత్ను చేశారు. అప్పటి నుంచి ఎల్లో మీడియా గాల్లో తేలుతోంది. రేవంత్ ఏం చేసినా ఆహా.. ఓహా అని పొగిడేస్తున్నారు. మిగిలిన మంత్రుల దగ్గరికొచ్చే సరికి సీన్ మారిపోతోంది.
తాజాగా భట్టిని ఆంధ్రజ్యోతి రిపోర్టర్ రైతు బంధు గురించి ప్రశ్నించి నవ్వుల పాలయ్యారు. డిప్యూటీ సీఎం నుంచి విలేకరికి ఊహించని సమాధానం ఎదురైంది. మన ప్రభుత్వం వచ్చాక రైతు బంధు ఇంత వరకు రాలేదు కదా అంటూ రిపోర్టర్ అడగ్గా భట్టి తనదైన శైలిలో స్పందించారు. ఎవరు చెప్పారు రాలేదని, ఆంధ్రజ్యోతి చెబితే అయిపోందా.. రాలేదని ఎవరు చెప్పారంటూ గాలి తీసేశారు. తమకు నచ్చని వారి విషయంలో రాధాకృష్ణ పత్రిక, మీడియా అడ్డదిడ్డంగా వ్యవహరించి పరువు పోగొట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భట్టి చురకలు అంటించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది.