ఫోర్బ్స్ ప్రతీ ఏటా విడుదల చేసే బిలియనీర్ జాబితాను విడుదల చేసింది. ప్రపంచం లోనే అత్యంత ధనవంతుడిగా ఫ్రాన్స్ కి చెందిన లగ్జరీ గూడ్స్ వ్యాపారవేత్త బెరెట్ ఆర్నాల్ట్ నిలవగా, స్పేస్ ఎక్స్ మరియ టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ రెండోవ స్థానం లో, అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ మూడో స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఇక భారత్ నుండి ముఖేష్ అంబానీ(9) టాప్ 10 లో స్థానం పొందగా, భారత్ నుండి రెండో పెద్ద కుబేరుడిగా అదానీ నిలిచాడు.. శివ్ నాడార్, సావిత్రి జిందాల్, దిలీప్ సాంగ్వి లు భారత్ నుండి తరువాతి స్థానాల్లో నిలిచారు..
ఇక తెలుగు రాష్ట్రాల నుండి:
6.2 బిలియన్ డాలర్లు (రూ.51వేలకోట్లు) తో మురళి దివి, కుంటుబం 469 వ ర్యాంకు లో నిలిచి టాప్ 500 లో చోటు సంపాదించారు.. ఇక తరువాతి స్థానాల్లో, 1104 స్థానం లో ప్రతాప్ సి రెడ్డి
-3 బిలియన్ డాలర్లు (రూ.26వేలకోట్లు), 1143 స్థానంలో జీఎం రావు -2.9 బిలియన్ డాలర్లు (రూ.25వేలకోట్లు) తో పీవీ రామ్ ప్రసాద్రెడ్డి
-2.9 బిలియన్ డాలర్లు (రూ.25వేలకోట్లు) తో కలిసి 1143 వ స్థానం పొందారు..
ఇక మైహోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వర్రావు-2.3 బిలియన్ డాలర్లు (రూ.19వేలకోట్లు) తో 1438 వ స్థానంలో, పీపీ రెడ్డి
-2.3 బిలియన్డాలర్లు (రూ.19వేలకోట్లు) 1438 స్థానంలో, పీవీ కృష్ణారెడ్డి
-2.2 బిలియన్ డాలర్లు (రూ.18వేలకోట్లు) 1496 స్థానంలో, ఎం.సత్యనారాయణ రెడ్డి- 2 బిలియన్ డాలర్లు (రూ.16వేలకోట్లు)-1623 స్థానంలో, కె.సతీశ్రెడ్డి-1.8 బిలియన్ డాలర్లు (రూ.15వేలకోట్లు) -1764 స్థానంలో జి.వి.ప్రసాద్
-1.5 బిలియన్ డాలర్లు (రూ.12వేలకోట్లు)
-2046 స్థానంలో నిలిచి తెలుగు రాష్ట్రాల నుండి టాప్ 10 కుబేరులుగా నిలిచారు…