సినీ దర్శకుడు మహి వి రాఘవ రాయలసీమలో సినీ స్టూడియో కట్టుకోవడానికి రెండెకరాల భూమి కేటాయించామని ఏపీ ప్రభుత్వాన్ని కోరడం దరిమిలా ప్రభుత్వం హార్స్ లీ హిల్స్ లో రెండెకరాలు కేటాయించడం జరిగాయి. అయితే స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వడం ఇవాళ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా ప్రారంభించిన సాంప్రదాయంలా, మునుపెన్నడూ లేనట్లుగా ఈ అంశం పై రాద్దాంతం చేసాయి టీడీపీ, దాని అనుకూల మీడియా. నిజానికి టీడీపీ హయాంలో సినీ, మీడియా వారికి కేటాయించినన్ని భూములు మరే ప్రభుత్వమూ, మరే రాష్ట్రము కేటాయించి ఉండకపోవచ్చు.
హైదరాబాద్ లో స్వాతంత్ర్యం వచ్చాక కట్టిన అతిపెద్ద స్టూడియో సారధి స్టూడియోస్ నేటికి ఉంది.. 1956 లో తెలుగు సినిమా పరిశ్రమ ను హైదరాబాద్ లో నెలకొల్పాలనే ప్రభుత్వం మరియు ప్రత్యేకంగా కేవీ రంగారెడ్డి పిలుపు మేరకు 11.5 ఎకరాల విస్తీర్ణం లో అమీర్పేట్ వద్ద ఏర్పాటు అయింది.. ప్రభుత్వం నామమాత్రపు ధరకే ఆ స్టలాన్ని కేటాయించింది..
తర్వాత 1976 లో అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ కోసం 22.5 ఎకరాలను ప్రభుత్వం కేటాయింపు చేసింది..
అదే ఏడాది గోల్కొండ క్రాస్ రోడ్ వద్ద ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియో నెలకొల్పాడు.. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని నాచారంలో ఇప్పుడున్న చోట దాదాపు పది ఎకరాల విస్తీర్ణం లో నిర్మించుకున్నారు…
ఇవన్నీ ప్రభుత్వాలు నామమాత్రపు రేటు కి స్థలాలు ఇవ్వడం ద్వారా ఏర్పడినవే. విశేషం ఏంటంటే రామకృష్ణ స్టూడియోలో ఇప్పటి వరకు మొత్తం 12 సినిమా లే షూటింగ్ జరిగింది..
1982 లో జూబ్లీ హిల్స్ లో 9.5 ఎకరాలు ప్రభుత్వం కేటాయించగా అక్కడ పద్మాలయ స్టూడియోస్ నిర్మించారు…
ఇక ఎన్టీఆర్ సీఎం అయ్యాక మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ తరలి రావాలని సినిమా వారికి విపరీతంగా స్థలాలు కేటాయించారు..
అందులో భాగం గానే 1983 లోనే ప్రముఖ నిర్మాత రామానాయుడు కి ఫిల్మ్ నగర్ లో 7.5 ఎకరాల కేటాయింపు చేయగా అందులోనే రామానాయుడు స్టూడియో ని నిర్మించాడు..
డైరెక్టర్ రాఘవేంద్ర రావుకు రికార్డింగ్ మరియు రీ రికార్డింగ్ స్టూడియో కట్టడానికి అనే పేరు మీద మీద ఆర్కే సినీ కాంప్లెక్స్ దగ్గర 1984 లో రెండెకరాల భూమి ఇవ్వగా… దానిలో రికార్డింగ్ స్టూడియో కట్టకుండా 2003 వరకు ఏ నిర్మాణం చేపట్టకుండా చంద్రబాబు ప్రభుత్వం థియేటర్ కట్టుకోడానికి పర్మిషన్ ఇస్తే, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు. కోర్టు దాన్ని తప్పుబట్టింది… ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలో ఉంది..
ఇక చంద్రబాబు సీఎం అయ్యాక 2003 లో వైజాగ్ లో రామానాయుడు స్టూడియోస్ కోసం ఏకంగా 35 ఎకరాలు నామమాత్రపు రేటు కి కేటాయింపు చేసింది. స్టూడియో కట్టడానికి మాత్రమే ప్రభుత్వం భూములు ఇస్తే, ఇటీవలే ఈ 35 ఎకరాల్లో 15 ఎకరాలను రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చడాన్ని సుప్రీం కోర్టు తప్పు బట్టింది..
ఇక ల్యాండ్ డాన్ రామోజీ రావుకు చరిత్రలో ఏ రాజూ, ఏ చక్రవర్తి …. ఏ కవికీ, మంత్రికి చేయనంత భూదానం చంద్రబాబు అధికారం లోకి వచ్చి ఏడాది కూడా తిరగకుండానే 1995 లో 2000 ఎకరాలను చాలా చాలా నామమాత్రపు ధరకి కట్టబెట్టాడు…
అది చాలక పక్కన ఉన్న సంఘీ వారి భూముల్ని, చిన్నా చితకా రైతుల భూముల్ని కూడా ప్రభుత్వ అండదండలతో కబ్జా చేసేశాడు. టీడీపీ హయాం లో హైదరాబాద్ లో సినిమా వారికి భూములు ఇవ్వడం ఏమో పరిశ్రమకు ప్రోత్సాహం అవుతుంది. తాము కూడా ప్రభుత్వ భూముల లో స్టూడియో లు నిర్మించుకుని ఇప్పటికీ వాటిని సొంత ఆస్తిలా భావించడమూ దైవ కార్యం అవుతుంది…
కానీ ఎక్కడో మదనపల్లిలో ఒక ఉత్సాహవంతుడు ఆంధ్ర ప్రదేశ్ లో కేవలం రెండెకరాల్లో (రెండు వేల ఎకరాల్లో కాదు) స్టూడియో కట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తూ భూ కేటాయింపు చేయడం పెద్ద కుంభకోణం లా ప్రజలు భావించాలని బలవంతపు వార్త రుద్దడం వారికి ఎందుకో ఏ మాత్రం అసహ్యం గా అనిపించదు…