విశాల్, హరి కాంబినేషన్లో తెరకెక్కిన మూడో చిత్రం రత్నం.. ఏప్రిల్ 26న తెలుగు తమిళ భాషల్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అప్పుడే ఓటీటీ గడప తొక్కనుందనే వార్తలు వస్తున్నాయి.. విశాల్ సరసన ప్రియ భవాని శంకర్ నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ దక్కలేదు. దాంతో కేవలం నెలలోపే ఓటీటీలోకి ఈ సినిమా రానుందని ప్రచారం జరుగుతోంది.
హరి, విశాల్ కాంబినేషన్లో గతంలో భరణి, పూజ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. దాంతో రత్నం మూవీపై ప్రేక్షకులకు అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక రత్నం చతికిల పడింది. రత్నం డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని మే నెల 24 నుండి ప్రైమ్ వేదికగా రత్నం స్ట్రీమింగ్ జరుగనుందని తెలుస్తుంది. తెలుగు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
కాగా రత్నంలో విశాల్ కి జంటగా డైరెక్టర్ శంకర్ కుమార్తె ప్రియ భవాని శంకర్ నటించగా మురళీ శర్మ, యోగి బాబు, విజయ్ కుమార్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతానికి మంచి మార్కులే పడినా రత్నం మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది..