దీపక్ సరోజ్ హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ సిద్ధార్థ్ రాయ్ చిత్రం ఓటిటిలోకి అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది ఫిభ్రవరిలో థియేటర్లలో రిలీజ్ అయిన సిద్దార్థ్ రాయ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక చతికిల పడింది. కాగా ఈ సినిమా త్వరలోనే ఓటిటిలోకి రానుంది. ఈ నెల అనగా మే 3 నుండి ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
గతంలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో మెప్పించిన దీపక్ సరోజ్ తొలిసారిగా సిద్దార్థ్ రాయ్ లో హీరోగా నటించడం గమనార్హం. టీజర్, ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడినా అర్జున్ రెడ్డి ఛాయలున్నాయని విమర్శలు వచ్చాయి. సినిమా రిలీజ్ కాకముందే రష్ చూసి డైరెక్టర్ సుకుమార్ నిర్మాణంలో సిద్దార్థ్ రాయ్ డైరెక్టర్ యశస్వి కాంబినేషన్లో సినిమా ఉంటుందని అనౌన్స్ కావడంతో సిద్దార్థ్ రాయ్ పై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.
తాజాగా ఆహాలో అందుబాటులోకి రానున్నఈ చిత్రంలో దీపక్ సరోజ్ హీరోగా నటించగా తన్వి నెగి హీరోయిన్గా నటించింది. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన ఈ మూవీని నిర్మించారు. మరి థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ ఓటిటిలో ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు దీపక్ సరోజ్. ఇక దీపక్ హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సిద్ధార్థ్ రాయ్ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ సినిమా థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వి యశస్వి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తన్వి నెగి హీరోయిన్గా యాక్ట్ చేసింది. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన ఈ మూవీని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.