జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినీ హీరోలు. వారికి అభిమానగణం ఉంది. ఇక తెలుగుదేశం యువరాజు నారా లోకేశ్.. ఈ ముగ్గురు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థులుగా ఎవరో రాజకీయ ఉద్ధండుల్ని పెట్టలేదు. మహిళామణులకు అవకాశం కల్పించారు.
పిఠాపురంలో పవన్పై వంగా గీత, హిందూపురంలో బాలకృష్ణపై టి.నారాయణ దీపిక, మంగళగిరిలో లోకేశ్పై మురుగుడు లావణ్యను బరిలోకి దింపారు. దీంతో ఈ పోరు ఉత్కంఠగా మారింది. ఆ ముగ్గురికి ఆడవారంటే చిన్నచూపు. పవన్ మూడు వివాహాలు చేసుకున్నారు. రేణుదేశాయ్ ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పిన విషయం తెలిసిందే. ఇక సినీ పరిశ్రమలో ఆడవారి విషయంలో ఆయన వ్యవహారశైలిలో అనేక విమర్శలున్నాయి. బాలకృష్ణ సినిమా ఫంక్షన్లో ఆడది కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలని తన ఫ్యాన్స్కు హితబోధ చేసిన వ్యక్తి. ఆయనతో నటించిన పలువురు నటీమణులు తమకు ఎదురైన సమస్యలను ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. ఇక లోకేశ్ అయితే తన సోషల్ మీడియా టీమ్ ద్వారా వైఎస్సార్సీపీకి సపోర్టు చేసే ఆడవారిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తుంటారు. అతని మనుషుల వల్లే ఇటీవల గీతాంజలి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వారందరి అధినేత చంద్రబాబు నాయుడు విషయానికొస్తే కోడలు మగబడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని గతంలో వ్యాఖ్యానించారు. వీరికి బుద్ధి రావాలంటే ఆడవారే కరెక్ట్.
పవన్ చిరంజీవి తమ్ముడు. బాలకృష్ణ ఎన్టీ రామారావు కుమారుడు. లోకేశ్ చంద్రబాబు తనయుడిగా ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది. ధన బలం ఉంది. అలాంటి వారిపై మహిళలను పోటీకి పెట్టడం సాహసనమే చెప్పాలి. వనితలను అవమానించేలా ప్రవర్తించే వ్యక్తులపై వారినే పోటీ పెట్టి బుద్ధి చెప్పించాలని చూస్తున్నారు జగన్. లోకేశ్పై బరిలోకి దిగుతున్న లావణ్య, బాలకృష్ణపై పోటీ చేస్తున్న దీపిక బీసీలే. జనరల్ సీట్లలో బీసీ మహిళలకు అవకాశం ఇచ్చిన ఘనత జగన్కే దక్కుతుంది. ముగ్గురికి ఆడవారే గుణపాఠం చెప్పనున్నారు. వాళ్లు కొట్టే దెబ్బకు మరోసారి మహిళలను చులకనగా చూడాలన్నా.. మాట్లాడాలన్నా భయపడాలి.